Featured

Ex IPS Narasaiah : ఎన్టీఆర్ ప్రధానిమంత్రి అయ్యేవాడు… ఆయన తెచ్చిన పథకాలే అన్నీ… భారతరత్న ఎందుకు రాలేదంటే…: విశ్రాంత ఐపిఎస్ ఆఫీసర్ నరసయ్య

Ex IPS Narasaiah : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టిఆర్ గారు సినిమాల్లో నటించేటపుడు కంటే సీఎంగా ఉన్నపుడు జరిగిన ఆసక్తికర విషయాలను ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న మాజీ ఐపిఎస్ నరసయ్య గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయనకసలు రాజకీయం రాదంటూ అదే తెలుసుంటే ఆయన దేశానికి పీఎం అయ్యేవాడని తెలిపారు. ఆయన ఎంత భోలా మనిషో అలాగే తనతో ఉండేవాళ్లకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు వంటి విషయాలను ఇంటర్వ్యులో పంచుకున్నారు.

ఆయన అనుకుని ఉంటే ప్రధాని అయ్యేవాడు…

ఎన్టీఆర్ గారికి రాజకీయ అవగాహనా లేదు. కేవలం తనను సినిమాల ద్వారా ఇంత ఆదరించిన ప్రజలకు తన వంతుగా ఏదైనా మంచి చేయాలనే తపన ఉండేది అంటూ నరసయ్య గారు తెలిపారు. ఆయనను మొదట్లో మీరు కమ్యూనిస్టా లేక ఏంటి అని అడిగితే ఆయన నేను హ్యుమనిస్ట్ అంటూ చెప్పేవారు. ఇండియాలో మొదట పేదవాడికి ఆహార భద్రత గురించి ఆలోచించింది ఈయనే. ఆడపిల్లలకు ఆస్థిలో సమానహక్కు ఈయన ఆలోచన.

పరిపాలన వికేంద్రీరికరణ మొదట చేసింది ఈయనే. మండలాల అభివృద్ధి అలాగే రాయలసీమకు సాగు నీరు కోసం తెలుగు గంగ ఇలా అన్నీ చేసిన ఆయనకు ప్రధాని అయ్యే ఆస్కారం ఉన్నా ఆయన అవలేదు. థర్డ్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్న ఆయన అనుకుని ఉంటే పీఎం అయ్యుండేవారు కానీ ఆయనకు రాజకీయాల మీద అవగాహన తక్కువ అంటూ చెప్పారు. పక్క రాష్ట్రంలో ఎంజిఆర్ గారికి భారతరత్న వచ్చింది. కానీ ఎన్టీఆర్ గారికి ఒక్క పద్మ శ్రీ తప్ప వేరే అవార్డులేవి రాలేదు. ఆయన భారతరత్నకు అర్హులే కానీ ఎవరూ ఇంతవరకు చొరవ చూపలేదు అంటూ అభిప్రాయాపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago