Featured

Ex MP Mysura reddy : వివేకానంద హత్య కేసుతో వైసీపీ కి నష్టం… రాజశేఖర్ రెడ్డికి మూడో భార్య…: ఎక్స్ ఎంపీ మైసూరా రెడ్డి

Ex MP Mysura Reddy : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, రాజకీయంగా ప్రకంపణలు రేపుతున్నా ఇప్పటికీ అసలు నేరస్థులు బయటికి రాలేదు. అయితే ఈ హత్య వైసీపీ పార్టీ కి నష్టం చేకూరుస్తుందంటూ కడప నేత మైసూరా రెడ్డి కామెంట్స్ చేశారు.

రాజశేఖర్ రెడ్డి మూడు పెళ్లిళ్లు…

కడప రాజకీయాల్లో సీనియర్ నేత అయిన మైసూరా రెడ్డి గారు వైసీపీ పార్టీ గురించి జగన్ పాలన గురించి మాట్లాడారు. వివేకానంద గారు రాజశేఖర్ రెడ్డి గారికి కుడిభుజం లాగ ఉండేవారు. అలాంటి అయన మరణించడం, కేసును తేల్చకపోవడంతో జగన్ పాలన మీద ఆ ప్రభావం ఉంటుంది. ఎంత మంచి పాలన అందించినా ఆ కేసు ప్రభావం ఉంటుంది అంటూ చెప్పారు.

ఇక రాజశేఖర్ రెడ్డి గురించి ఇటీవల వస్తున్న వార్తలు గురించి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి గారికి విజయమ్మ కంటే ముందే ఇంకో మహిళతో పెళ్లి జరిగిందంటూ వస్తున్న వార్తల గురించి మాట్లాడుతూ అవన్నీ నాకు తెలియదని, అయినా రాజకీయాల్లో కుటుంబాల గురించి మాట్లాడటం మంచిది కాదు కానీ జగన్ కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటం మంచి పని కాదు. అలా కుటుంబ విషయాలు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదు అంటూ కామెంట్స్ చేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago