న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే రానుందనే వార్తలతో మళ్లీ హుషారుగా ఉన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan) 20వ విడత డబ్బులు విడుదలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లబ్ధిదారులైన రైతులు రూ.2,000 చెల్లింపులు ఎప్పుడు తమ ఖాతాల్లోకి వస్తాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వాటిపై తాజా సమాచారం మేరకు, పీఎం కిసాన్ పథకంలోని 20వ విడత జూలై 18న విడుదలయ్యే అవకాశం ఉంది. గత 19వ విడత ఫిబ్రవరిలో విడుదల కాగా, ఆ తర్వాతి విడత జూన్లో రాలేదు. ఆలస్యం కారణంగా రైతుల్లో ఆందోళన నెలకొంది. అయితే, పలు నివేదికల ప్రకారం జూలై 18న బీహార్లోని మోతీహరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారని సమాచారం. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ఈ మొత్తం పొందేందుకు రైతులు కొన్ని ముఖ్యమైన పనులను ముందే పూర్తి చేసి ఉండాలి. అందులో భాగంగా భూమి రికార్డుల అప్డేట్, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయడం, e-KYC పూర్తి చేయడం వంటి ముఖ్యమైన దశలను రైతులు పాటించాల్సి ఉంటుంది.
భూమి రికార్డులు అప్డేట్ చేయడం ఎలా?
ఇతర అవసరమైన ప్రక్రియలు:
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేయండి:
ఈ ప్రక్రియలను సకాలంలో పూర్తి చేస్తేనే రైతులు 20వ విడతలో తమ ఖాతాల్లో రూ.2,000 చెల్లింపులను పొందగలుగుతారు. కాబట్టి సంబంధిత పనులను ఇప్పుడే పూర్తి చేసుకోవడం మేలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…