దేశంలో ప్రజలు కరోనా మహమ్మారి కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మహమ్మారిని కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. సీరమ్ ఇన్సిట్యూట్ ఇప్పటికే డిసెంబర్ నాటికి భారత్ కు ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని కీలక ప్రకటన చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ ముక్కు ద్వారా ఉపయోగించే వ్యాక్సిన్ కొరకు దేశంలో ప్రయోగాలు చేయడానికి భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు ఇచ్చినట్టు వెలడించారు.
త్వరలో వ్యాక్సిన్ల ప్రయోగాలకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇవ్వనుంది. వ్యాక్సిన్ల ప్రయోగాలు సక్సెస్ అయితే మాత్రం ఇంట్రా నాసల్ కొవిడ్ వ్యాక్సిన్ మరికొన్ని నెలల్లోనే భారత ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సాధారణ వ్యాక్సిన్లతో పోలిస్తే ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ను దాదాపు 40 వేల మంది వాలంటీర్లపై ప్రయోగించే అవకాశం ఉంది.
మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ రష్యా కరోనా వ్యాక్సిన్ కు కూడా భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంజక్షన్ల రూపంలో ఉన్న వ్యాక్సిన్ల తయారీ మాత్రమే జరుగుతోందని.. చెప్పిన సమయంలో భారత్ ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రయోగాలను చేపడుతూ ఉండటం గమనార్హం.
కరోనా వైరస్ మన శరీరంలోకి ముక్కు, నోటి ద్వారానే ప్రవేశిస్తూ అనేక ఆరోగ్య సమస్యలను సృష్టిస్తోంది. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 75 లక్ష్లలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుందని సమాచారం. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ తరహా కరోనా వ్యాక్సిన్ గురించి ప్రయోగాలు చేపడుతున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…