Featured

జగన్ సర్కార్ శుభవార్త.. ఉచితంగా నిత్యావసర సరుకులు!

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమపై వర్షాల ప్రభావం అంతగా లేకపోయినా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు వర్షాలు, వరదల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో వర్షాలు, వరదల ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ వరదల వల్ల వందల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తాజాగా జగన్ సర్కార్ వర్షాలు, వరదల వల్ల నిరాశ్రయులైన వాళ్లకు శుభవార్త చెప్పింది. వరద బాధితులకు ఉచితంగా ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేయడానికి ప్రభుత్వం నుంచి జీవో విడుదలైంది. రాష్ట్రంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో అధికారులు బాధితుల వివరాలను సేకరించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. బాధితులకు సరుకులు అందే విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల రేషన్ బియ్యం, లీటర్ పామాయిల్, కిలో కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు ఇవ్వనుంది. వేగంగా నిత్యావసర సరుకుల పంపిణీ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జగన్ సర్కార్ ఆదేశించింది. మరోవైపు పంట నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు నగదు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

జగన్ సర్కార్ ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రయోజనం చేకూర్చుతూ ఉండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

8 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

8 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

8 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

8 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

8 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

8 hours ago