General News

ఆగ్రహించిన ఉల్లి రైతు.. మార్కెట్ కు తీసుకొచ్చిన పంట విషయంలో..!

మొన్నటి వరకు ఉల్లి ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో ఎక్కువగా రైతులు లాభపడ్డారు. ప్రస్తుతం అదే ఉల్లి రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదని ఓ రైతు ఆగ్రహించి తాను పండించిన పంటకు నిప్పు పెట్టాడు.

ఈ ఘటన కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంచలింగాల గ్రామానికి చెందిన ఉల్లి రైతు వెంకటేశ్వర్లు ఉల్లిని విక్రయించేందుకు మార్కెట్ కు వెళ్లాడు. మొన్నటి వరకు మంచి డిమాండ్ ఉన్న ఉల్లికి ప్రస్తుతం కూడా అదే డిమాండ్ ఉంటుందని అనుకున్నాడు.

కానీ అతడు కర్నూలు మార్కెట్‌కు తన ఉల్లిని తీసుకొచ్చిన తర్వాత షాక్ అయ్యాడు. ఈ-నామ్‌ పద్ధతిలో క్వింటా రూ.350 ధర పలకడంతో దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గిట్టుబాటు ధర లభించడం లేదంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ-నామ్‌ పద్ధతి ద్వారా కొంతమంది రైతులకు మాత్రమే మంచి ధరలు వస్తున్నాయని.. మిగతా వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా.. ఆగ్రహించిన రైతు ఉల్లి బస్తాలపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. ఇక దీనిపై అధికారులు స్పందించారు. క్వింటాల్ కు రూ.600 నుంచి రూ.700 మధ్య ఇప్పిస్తామని ప్రకటించడంతో రైతులు శాంతించారు. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇటువంటివి మరోసారి చోటు చేసుకోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago