గతేడాది కరోనా వైరస్ దేశంలో వ్యాపించడంతో అధికారులు ముందుగా అప్రమత్తమై లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే ఎంతో మంది కూలీలు ఉపాధి లేక తమ సొంత ఊర్లకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలోనే రోడ్డుపై వాహనాలు తిరగకపోవడంతో వలస కూలీలు ఏకంగా కాలిబాటన తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే బీహార్ కి చెందిన బాలిక జ్యోతి పేరు విస్తృతంగా మారుమోగిపోయింది.
దర్భంగ జిల్లా సిర్హులి గ్రామానికి చెందిన మోహన్ పాశ్వాన్ కుటుంబ పోషణ కోసం గురుగ్రామ్లో ఆటో నడిపే వాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. అయితే గతేడాది లాగిన్ విధించడానికి ముందుగా రోడ్డు ప్రమాదంలో మోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే తన తండ్రి బాగోగులు చూసుకోవడం కోసం తన పెద్ద కూతురు జ్యోతి గురుగ్రామ్ చేరుకుంది. మార్చి నెలలో కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో జ్యోతి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తినడానికి తిండి లేక వారు ఉంటున్న ఇంటికి అద్దె కట్టలేక ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది.
ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో ఎలాగైనా తన సొంత ఊరికి వెళ్లాలని భావించింది. కానీ ఎలాంటి వాహనాలు అందుబాటులో లేకపోవడం, తన తండ్రి ఎటూ కదలలేని పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచని జ్యోతి తన దగ్గరున్న కొంత డబ్బును ఖర్చు చేసి ఒక పాత సైకిల్ కొని ఏకంగా 12 వందల కిలోమీటర్లు, ఏడు రోజులపాటు తన తండ్రి సైకిల్ పై కూర్చోపెట్టుకొని సొంత గ్రామానికి చేరిన జ్యోతి గురించి అప్పట్లో పలు మీడియా సంస్థలు “సైకిల్ గర్ల్” పేరుతో కథనం రాయడంతో దేశం మొత్తం జ్యోతి పేరు మారుమోగిపోయింది.
ఈ విధంగా తండ్రి కోసం ఎంతో తపన పడి సైకిల్ గర్ల్ గా గుర్తింపును సంపాదించుకున్న జ్యోతి తండ్రి మోహన్ సోమవారం గుండెపోటు రావడంతో మరణించారు. మోహన్ మృతి పట్ల దర్భాంగ జిల్లా అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి తన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…