ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర రూపం దాలుస్తుంది. రెండవ దశ దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రళయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అంటూ ప్రపంచంపై వివిధ రకాల వైరస్ కు దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే థర్డ్ వేవ్ పిల్లలు అధికమైన ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు హెచ్చరించడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే మూడవదశ కరోనాను ఎదుర్కోవడం కోసం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
భారతదేశంలో మొదటి వేవ్ పెద్దగా ప్రభావం చూపించక పోవడంతో రెండవ దశను చాలా తక్కువ అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఇండియా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.దీంతో అలర్ట్ అయిన భారత ప్రభుత్వం మూడవ దశను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వంలో అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా చికిత్స రేట్లు ఒకే విధంగా ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.రెండో దశపై ప్రభుత్వం సరిగా రెడీ అవ్వలేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఇప్పటికే ఒకే జిల్లాలో 8వేల మంది పిల్లలకు కరోనా వచ్చిందన్న హైకోర్టు… థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.తమ ప్రశ్నలపై హెల్త్ సెక్రెటరీ, డీహెచ్, డీజీపీ… హైకోర్టులో రిపోర్ట్ ఇవ్వాలని విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పటివరకు సుమారు కోటి మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ టార్గెట్ ను చేరుకోలేకపోయింది. దేశంలో సగటు కంటే ఏపీలో ఎక్కువగా వ్యాక్సిన్లు వేశారు. ఏపీలో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 1,00,17,712కి చేరింది. ఒక్క డోసే తీసుకున్న వారి సంఖ్య 74,92,944గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ గురించి ప్రజలలో అవగాహన కల్పించి, ఫోన్లు చేసి మరీ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రజలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు.
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…