Bigg Boss: బిగ్ బాస్ సెట్లో అగ్ని ప్రమాదం...! తప్పిన పెను ముప్పు..!
Bigg Boss: బిగ్ బాస్ ఈ షోకు ఉండే క్రేజ్ వేరు. హిందీలో మొదటగా ప్రారంభమైన ఈ షో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ప్రారంభం అయింది. మన దేశ కల్చర్ ను బిగ్ బాస్ పాడు చేస్తుందంటూ.. చాాలా మంది అనుకుంటున్నా.. కూడా ఈషో చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తోంది. చిన్న నుంచి పెద్ద వరకు ఈ షోను ఎంజాయ్ చేస్తున్నారు.
అప్పటి వరకు కొంత మందికే పరిచయం ఉన్న వారిని ఓవర్ నైట్ లో బిగ్ బాస్ స్టార్లను చేస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్లు రియాలిటీ షోలు, టీవీ షోలు, సినిమాల్లో ఛాన్సులు కొల్లగొడుతున్నారు. కొంత మంది సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస్5 సీజన్ లో విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ కూడా ‘సకలగుణాభిరామ’ సినిమాలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు.
హిందీ బిగ్ బాస్ షోకు దేశంలో పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఉన్నారు. తాజాగా ఈ షో గ్రాండ్ ఫినాలే జనవరి 30న జరిగింది. ప్రేక్షకులు తేజస్వి ప్రకాష్కి పట్టం కట్టారు. అత్యధిక ఓట్లు సంపాదించినా తేజస్వి టైటిల్ సొంతం చేసుకున్నాడు. షెహజ్ పాల్ రన్నరప్గా నిలిచాడు. బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి ప్రకాష్ టైటిల్ ఫేవరేట్గానే ముందు షోకు ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి తనదైన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది తేజస్వి.
ఇదిలా ఉంటే.. హిందీ బిగ్ బాస్ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సెట్ ముంబైలోని ఫిలిమ్ సిటీలో ఉంది. రెండు వారాల క్రితం బిగ్ బాస్ ముగిసినా.. సెట్ మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతం దీంట్లోనే అగ్ని ప్రమాదం సంబవించింది. అయితే సెట్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగడంతో నాలుగు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పేశాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…