దేశంలోని ప్రజల మధ్య చాలా సంవత్సరాల నుంచి ఏలియన్ల గురించి చర్చ జరుగుతోంది. ఏలియన్లు ఉన్నాయని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుంటే మరి కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఏలియన్లు లేవని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు రేడియో తరంగాలను పంపించడం ద్వారా ఏలియన్లు ఉన్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు శాస్త్రవేత్తలు పంపిన సందేశాలకు ఏలియన్ల నుంచి స్పందన రాలేదు.
అయితే హార్వర్డ్ ప్రొఫెసర్ లోయెబ్ మాత్రం 2017 సంవత్సరంలోనే భూమిపైకి ఏలియన్లు వచ్చాయని వెల్లడిస్తున్నారు. 2017 సంవత్సరం భూమిపై సిగార్ ఆకారంలో ఉన్న ఆస్టరాయిడ్ దొరికిందని భూమిపై ఏలియన్లు ఉన్నాయని చెప్పడానికి సాక్ష్యం ఇదేనని ఆయన అన్నారు. లోయబ్ ఆయన రాసిన కొత్త పుస్తకంలో ఈ విషయాలను పేర్కొన్నారు. వేవార్డ్ ఏలియన్ టెక్నాలజీ ద్వారా దొరికిన ఆస్టరాయిడ్ ఏలియన్లదే అని గుర్తించామని అన్నారు.
వేరే గెలాక్సీ నుంచి ఆ ఆస్టరాయిడ్ భూమిపైకి వచ్చిందని.. వింతరీతిలో ఆ ఆస్టరాయిడ్ కదులుతోందని తెలిపారు. స్వచ్చమైన కేంద్రబిందువు నుంచి ఆ ఆస్టరాయిడ్ వచ్చిందని గతేడాది చేసిన పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు. భూమికి 25వేల కాంతి సంవత్సరాల దూరం నుంచి ప్రయాణించి ఆ ఆస్టరాయిడ్ భూమిని చేరిందని లోయబ్ అన్నారు. ఆ ఆస్టరాయిడ్ 2017 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన సౌర వ్యవస్థ ఆర్బిటర్ తలాన్ని దాటిందని వెల్లడించారు.
మనుషులు మాత్రమే అంతరిక్షంలో ఏలియన్లు ఉన్నాయని చెప్పడానికి సాక్ష్యం అని.. ఆ ఆస్టరాయిడ్ ఏలియన్ సంతతికి చెందిన ఆస్టరాయిడ్ అని తాము భావిస్తున్నామని లోయబ్ చెప్పుకొచ్చారు. లోయబ్ చేసిన తాజాగా ప్రకటనతో ప్రజల మధ్య ఏలియన్ల గురించి మరోసారి చర్చ జరుగుతోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…