వైద్యులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు గుడ్లు కచ్చితంగా తినాలని చెబుతుంటారు. రోజుకు కనీసం ఒక గుడ్డు తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడిస్తూ ఉంటారు. గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో గుడ్లు సహాయపడతాయి. కంటిచూపును మెరుగుపరచడంలో, బరువును తగ్గించడంలో గుడ్లు సహాయపడతాయి.
గుడ్లలో మెదడుకు ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలతో పాటు శరీరానికి మేలు చేసే కొలెస్టారాల్ పెరుగుతోంది. గుడ్లు తీసుకోవడం వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా చేయడంలో గుడ్లు సహాయపడతాయి. అయితే గుడ్ల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరినా ఎక్కువగా గుడ్లను తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి రెండు నెలల క్రితం మరో వ్యక్తితో తాను 50 గుడ్లు తినగలనని చెప్పి పందెం వేసి 42 గుడ్లు తిన్న తరువాత మృతి చెందాడు. అందువల్ల అవసరానికి మించి గుడ్లు తీసుకున్నా ప్రమాదమే అని గుర్తుంచుకోవాలి. గుడ్లను ఎల్లప్పుడూ పూర్తిగా ఉడికించి తినాలి. ఉడికించడం వల్ల గుడ్లలో ఉండే హానికారక బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతుంది. పచ్చిగుడ్డును తీసుకోవడం కంటే ఉడకబెట్టిన గుడ్డును తీసుకుంటే మంచిది.
టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవాళ్లు గుడ్డును తీసుకోకపోవడమే మంచిది. ఫుడ్ అలర్జీ వల్ల బాధ పడుతున్న వాళ్లు గుడ్లను తక్కువగా తీసుకుంటే మంచిది. యాంటీ బయోటిక్స్ మందులు ఎక్కువగా వాడే వాళ్లు సైతం గుడ్లను తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…