General News

మీ తప్పు లేకుండా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కట్ అయ్యాయా.. ఇలా తిరిగి పొందే ఛాన్స్..?

దేశంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పలు స్కీమ్ లకు సంబంధించిన నగదు బ్యాంక్ అకౌంట్లలో జమవుతూ ఉండటంతో దేశంలో బ్యాంక్ ఖాతాలు ఉన్నవారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఇదే సమయంలో టెక్నాలజీ వినియోగం పెరగడంతో సైబర్ మోసాలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. చాలామంది బ్యాంక్ అకౌంట్లు ఉన్నవాళ్లు కొన్ని సందర్భాల్లో వాళ్ల తప్పేం లేకపోయినా బ్యాంక్ ఖాతాలో డబ్బులు కట్ కావడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు.

అయితే ఖాతాదారుడి ప్రమేయం లేకుండా డబ్బులు కట్ అయితే అందుకు బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి మోసాలకు పాల్పడితే బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసే బ్యాంకులే ఆ నగదుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. గతంలో జాతీయ వినియోగదారుల కమిషన్ ఈ మేరకు ఒక కేసులో తీర్పు ఇచ్చింది.

జాతీయ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రెండేళ్ల క్రితం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ లోపాలు లేదా బ్యాంక్ నుంచి పొరపాటు వల్ల ఖాతాలో నగదు కట్ అయితే బ్యాంకులే ఆ నగదుకు బాధ్యత వహిస్తాయని ఆర్బీఐ వెల్లడించింది. కస్టమర్ తప్పు వల్ల డబ్బులు పోతే మాత్రం కస్టమర్ పోయిన డబ్బుకు బాధ్యత వహించాలి.

బ్యాంక్ తప్పు లేకుండా, కస్టమర్ తప్పు లేకుండా నగదు కట్ అయితే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తే కొంత మొత్తం పొందే అవకాశం ఉంది. జాతీయ వినియోగదారుల కమిషన్, ఆర్బీఐ బ్యాంకింగ్ లోపాల వల్ల ఖాతాదారుల విషయంలో జరిగే మోసాలకు బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

8 minutes ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

27 minutes ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

17 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

18 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

19 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

19 hours ago