24 క్యారెట్ల తులం బంగారం ధర త్వరలో రూ.2 లక్షల మార్క్ను దాటే అవకాశం ఉందన్న అంచనాలతో బంగారం మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. వ్యాపార విశ్లేషకుల అంచనాలే కాదు, అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ భావనకు బలం ఇస్తుండటంతో ప్రజలు ముందస్తు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడిగా బంగారం కొనాలనుకునే వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసిద్ధ బేగంబజార్ ప్రాంతంలో బంగారం మార్కెట్లో సందడి నెలకొంది. దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కృష్ణ జ్యూవెల్లర్ మార్ట్ వద్ద హోల్సేల్ బంగారు కాయిన్లు, బిస్కెట్ల కోసం జనం పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలబడి టోకెన్లు తీసుకుని మరీ కొనుగోళ్లు చేస్తున్నారు. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండటం గమనార్హం.
బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాల వెనుక అంతర్జాతీయ కారణాలు కీలకంగా మారాయి. ప్రపంచ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ధరలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా విధానాలపై ఉన్న అనిశ్చితి పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తోంది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించడం మార్కెట్లలో ఆందోళనకు దారితీసింది. అలాగే దక్షిణ కొరియా నుంచి దిగుమతి అయ్యే వాహనాలు, ఔషధాలపై అమెరికా 25 శాతం పన్నులు పెంచడం కూడా అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండిని సురక్షిత ఆస్తులుగా భావిస్తూ పెట్టుబడిదారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు.
ఆసియా, యూరప్ దేశాలు ఇప్పటికే పెద్ద మొత్తాల్లో బంగారం కొనుగోలు చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా విధానాల్లో స్పష్టత లేకపోవడం ఈ ఏడాది బంగారం ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారిందని ఆగ్మాంట్ సంస్థ ప్రతినిధి రెనిషా చైనానీ వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా చూస్తే, ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలే ప్రస్తుతం బంగారం మార్కెట్కు ప్రధాన ఊపునిస్తున్నాయి. దీంతో సాధారణ వినియోగదారుల నుంచి పెద్ద పెట్టుబడిదారుల వరకు అందరూ బంగారంపై దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…