Aadhar Pay: క్యాష్ లెస్ డిజిటల్ లావాదేవీలు ఇండియాలో గణనీయంగా పెరిగాయి. డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. భారత దేశంలో డిజిటల్ పేమెంట్లు ఎంతగా మారాయంటే… దేవాలయాల్లో హుండీలకు కూడా క్యూఆర్ కోడ్ లు వచ్చే అంతగా మార్పు చెందాయి.
ప్రస్తుతం దేశంలో గుగూల్ పే, ఫోన్ పే, భీమ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి.
తాజాగా త్వరతలో ‘ ఆధార్ పే’ కూడా రానుంది. గుగూల్ పే, ఫోన్ పే లాగే ఆధార్ పే చేసుకోవచ్చు. అన్ని ఎంఓఎస్ డిజిటల్ కేంద్రాల వద్ద ఆధార్ పే ద్వారా చెల్లింపులు జరుపుకునే వెసులుబాటు కలిగింది.
బయోమెట్రిక్ మెషిన్ల ద్వారా ఆధార్ నెంబర్ ఆధారిత ఆర్థిక లావాదేవీలు జరుపుకునే వీలు ఉంది. ఈ సౌకర్యాన్ని ఎంఎస్ఓ యుటిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అందుబాటులోకి తేనుంది. బయోమెట్రిక్ యంత్రాల ద్వారా ఆధార్ నంబర్ ఆధారంగా ఆర్థిక లావాదేవీలు జరుగనున్నాయి.
దీని వల్ల నగదు రహిత లావాదేవీలకు మరింత ముందడుగు పడనుంది. ఇప్పటికైతే వెండర్ ‘ ఆధార్ పే’ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ లావాదేవీలకు ఆధార్ నెంబర్ ఖచ్చితంగా బ్యాంకు ఖాతాాకు లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం యూనిక్ ఫింగర్ ఇంప్రెషన్ వాడుకోనుంది. ఈ ఫింగర్ వెరిఫికేషన్ ద్వారా బ్యాంకు నుంచి నగదు బదిలీ జరుగుతుంది. బ్రాంచ్ లెస్ బ్యాంకింగ్ టై అప్ ల ద్వారా వినియోగదారుడు తమ ఇళ్ల సమీపం నుంచే బ్యాంకింగ్ సేవలను పొందే అవకాశం ఏర్పడింది. దేశంలోని మారుమూల, సుదూర ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను విస్తరించడంలో ఇది కీలక ముందుడుగా అభివర్ణించవచ్చు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…