పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా, ప్రిమియర్ షోల నుంచే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా మొదలైంది. అభిమానుల ఉత్సాహంతో పాటు, ఈ సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం విషయంలో వైసీపీ నేతలపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి బాబా తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ నేతలపై మండిపడ్డ ఆయన, యాంకర్ శ్యామలను “పందిపిల్ల”, మాజీ మంత్రి రోజాను “బర్రెపిల్ల” అంటూ విమర్శించారు. హరిహర వీరమల్లు సినిమానే వారికొక చెంపదెబ్బ, చెప్పుదెబ్బలాంటిదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడమే తప్ప, వేరే బిజినెస్లు చేయడం లేదని సాయి బాబా పేర్కొన్నారు. మరొకవైపు, రోజా తిరుమలలో టికెట్లు అమ్ముకొని కోట్లు సంపాదించిందని ఆరోపించారు. హరిహర వీరమల్లు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తనను ఎంతో ఆనందపరచిందని అన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిత్ర కథ 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యాన్ని నేపథ్యంగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో వీరమల్లు అనే యోధుడిగా అలరిస్తారు. మొఘల్ పాలకుల చే బందీగా ఉన్న నగరాన్ని విముక్తి చేయడం, అణగారిన ప్రజల్లో నూతన ఆశ నింపడం కోసం కోహినూర్ వజ్రాన్ని దొంగలించేందుకు ఆయన చేపట్టిన సాహసోపేతమైన మిషన్ చుట్టూ కథ తిరుగుతుంది. సినిమా విడుదలైన మొదటి రోజే మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సన్నివేశాలకు ప్రశంసలు వచ్చినప్పటికీ, కథనం, వీఎఫ్ఎక్స్ నాణ్యత కొంతమంది ప్రేక్షకులను నిరాశపరిచినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదలైంది. క్లైమాక్స్లో సీక్వెల్కు సంబంధించిన టైటిల్ హరిహర వీరమల్లు: పార్ట్ 2 – బ్యాటిల్ఫీల్డ్ను ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రం ఆగస్టు చివరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ కావచ్చని తెలుస్తోంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…