Geetha krishna : అల్లూరి జయతోత్సవాలు భీమవరంలో ఘనంగా జరిగాయి. అల్లూరి కాంస్య విగ్రహాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఇక ఈ వేడుకలో దేశ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, పర్యాటక శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. బీజేపీ తో సఖ్యతగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఈ వేడుకకు పిలవ పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈవిషయం పై తన మార్కు స్పందన తెలియజేసాడు గీతా కృష్ణ.
అన్నదమ్ముల మధ్య కాపు చిచ్చు…
పవన్ కళ్యాణ్ ను వేడుకకు పిలవకుండా కేవలం చిరంజీవిని పిలవడం జగన్ వ్యూహమని భీమవరం ప్రాంతంలో కాపులు, రాజులదే హవా. అందుకే జగన్ తెలివిగా చిరంజీవిని పిలిచాడు. కానీ ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని, సీఎం మాట్లాడారు కానీ చిరంజీవి మాట్లాడలేదు. కాపుల ఓట్లు చీల్చేందుకు జగన్ ఇలా చేసారని గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు. చిరంజీవిని సోదరుడు అని సంభోదించడం కూడా అందులో భాగమే అన్నట్లు ఆయన చెప్పారు.
ఇక జగన్ బీజేపీ తో సన్నిహితంగా ఉన్నాడని తెలిపారు. ఇక చిరు వైసీపీ, లేదా బీజేపీ పార్టీ లోకి చేరే అవకాశాలను చెప్పాడు గీతాకృష్ణ. చిరు రాజకీయం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపినప్పుడే అయిపోయింది. ఇక ఇపుడు తమ్ముడికి విరుద్ధంగా వైసీపీ లోకి చేరకపోవచ్చు కానీ బీజేపీ లోకి ఒకవేళ ఆహ్వానిస్తే వెళ్లే అవకాశం లేకపోలేదు అంటూ చెప్పారు. కానీ ఏం జరిగినా ఈసారి కూడా జగన్ సీఎం అవుతాడు అంటూ జోష్యం చెప్పాడు గీతాకృష్ణ.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…