ప్రస్తుత కాలంలో డబ్బులను పొదుపు చేయడం ఎంతో అవసరం. ఎవరైతే పొదుపు సూత్రాన్ని పాటిస్తారో వాళ్లు భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే డబ్బు దాచుకోవడానికి బ్యాంకులు అతి సురక్షితమైనవి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఎక్కువ వడ్డీ ఆశించే వాళ్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఎఫ్డీ రిస్క్ లేని పెట్టుబడి కావడంతో చాలామంది వీటిపై ఆసక్తి చూపుతారు.
అయితే ఎఫ్డీలలో వడ్డీల విషయానికి వస్తే ఒక్కో బ్యాంకులో ఒక్కో తరహా వడ్డీలు ఉంటాయి. మనం ఎంచుకునే మెచ్యూరిటీ కాలాన్ని బట్టే ఎఫ్డీల వడ్డీ ఆధారపడి ఉంటుంది. బ్యాంకును బట్టి ఎఫ్డీ వడ్డీరేట్లలో మార్పులు ఉండటంతో ముందుగానే ఎఫ్డీల విషయంలో అవగాహన ఏర్పరచుకుని డబ్బులను డిపాజిట్ చేయాలి. ఇలా డిపాజిట్ చేయడం వల్ల తక్కువ సమయంలో సులువుగా ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
అయితే ఎఫ్డీ డబ్బులను మెచ్యూరిటీ కాలం తర్వాతే తిరిగి పొందాలి. అలా చేయని పక్షంలో పెద్దగా వడ్డీ రాదు. బ్యాంకులు ఎఫ్డీల మెచ్యూరిటీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఎవరైనా రెన్యువల్ చేసుకోవాలని భావిస్తే నచ్చిన కాలపరిమితిని ఎంచుకొని సులభంగా ప్రయోజనం పొందే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి.
చాలామంది ఆటోమేటిక్ రెన్యువల్ కు పాధాన్యతను ఇస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అయితే అత్యవసరమైతే బ్యాంకులో ఎఫ్డీ డబ్బులను ముందుగానే తీసుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. అయితే ముందుగా డబ్బులు తీసుకోవాలని భావిస్తే మాత్రం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అన్ని విషయాలపై సరైన అవగాహన ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…