Ghattamaneni Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఘట్టమనేని ఫ్యామిలీ ఒకటి. సూపర్ సార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అయితే ఈయన బాల నటుడిగాను హీరో గాను ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా మహేష్ బాబు కుటుంబానికి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది ఘట్టమనేని కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరిలోనూ ఒక క్వాలిటీ ఉంది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. మరి మహేష్ బాబు కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి ఈ కామన్ క్వాలిటీ ఏంటి అనే విషయానికి వస్తే… సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే వారికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే అదే అలవాటు మహేష్ బాబుకి కూడా వచ్చింది ఈయన ఏకంగా మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించి పలు హాస్పిటల్స్ తో అనుసంధానం అయ్యి పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.
ఇక మహేష్ బాటలోనే తన పిల్లలు కూడా నడుస్తున్నారు సితార ఇంత చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తాను నటించిన మొదటి యాడ్ కి గాను ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ రావడంతో ఈ డబ్బు అంతటినీ కూడా ఈమె మహేష్ బాబు ఫౌండేషన్ కి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా తన పుట్టినరోజు సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పిల్లలకు ఉచితంగా సైకిళ్లు కొనిచ్చారు. ఇక గౌతమ్ సైతం మహేష్ బాబు ఫౌండేషన్ తో అనుసంధానమైనటువంటి ఆసుపత్రులకు వెళ్లి అక్కడ చిన్నారులను పలకరించి వారికి కానుకలు ఇవ్వడమే కాకుండా వారి ముఖంలో చిరునవ్వులు వచ్చేలా చేశారు. ఇలా ఘట్టమనేని కుటుంబంలో ప్రతి ఒక్కరిలో కూడా సహాయం చేయడం జాలి దయ అనే కామన్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…