మనలో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే మెజారిటీ ఉద్యోగుల వేతనం 25,000 రూపాయల కంటే తక్కువగానే ఉంటుంది. తక్కువ మొత్తం వేతనం రూపంలో లభిస్తూ ఉండటం వల్ల విద్య, వైద్యం, పెళ్లి లాంటి వాటి కోసం ఖర్చు చేయాల్సి వస్తే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలు భారీగా తగ్గాయి.
మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటే మాత్రమే ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించటానికి కంపెనీలు సిద్ధపడే అవకాశం ఉంటుంది. అయితే తక్కువ మొత్తం వేతనం లభిస్తోందని ఏ మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ మొత్తంలో వేతనం పొందుతున్న వారి కోసం ప్రత్యేక స్కీమ్స్ ను అందుబాటులోకి తెచ్చి ఆ స్కీమ్స్ ద్వారా వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. ఫ్రీగానే కొన్ని రకాల సౌకర్యాలు పొందే అవకాశం కల్పిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇఅలాంటి స్కీమ్స్ అందుబాటులో లేవు కాని హరియాణ ప్రభుత్వం మాత్రం నెలకు కేవలం 25 రూపాయలు చెల్లించి విద్య, వైద్యం, పెళ్లి కోసం ప్రభుత్వం నుంచి సాయం పొందవచ్చు. నెలకు మొత్తం 75 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఉద్యోగి 25 రూపాయలు చెల్లిస్తే మిగిలిన 50 రూపాయలు ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి నెల చెల్లించిన యువతులు పెళ్లి చేసుకుంటే వారికి ప్రభుత్వం 51,000 రూపాయలు అందిస్తుంది.
మహిళలు చెల్లిస్తే వాళ్ల ఆడపిల్లలకు ప్రభుత్వం నుంచి 51,000 రూపాయల ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వం పెళ్లికి మూడు రోజుల మందు ఈ నగదు లబ్ధిదారులకు అందేలా చేస్తుంది. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే స్కూల్ డ్రెస్, బుక్స్ కోసం ప్రతి సంవత్సరం 4,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. పని చేసే సమయంలో వైకల్యం సంభవిస్తే లక్షన్నర రూపాయలు, మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కుటుంబానికి అందుతుంది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…