General News

రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఈ కార్డుతో తక్కువ ధరకే టికెట్లు..!

దేశంలో సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడతారు. బస్సు, విమాన ప్రయాణాలతో రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం కావడంతో పాటు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు ప్రయాణికులు రైలు టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

వేరే విధంగా కూడా రైలు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ మంది ప్రయాణికులు ఈ విధానం ద్వారానే టికెట్లను బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే తాజాగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైలు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీసీ ఎస్బీఐ రూపే కార్డ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డ్ ద్వారా ప్రయాణికులు సులువుగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మోదీ సర్కార్ గత కొన్ని నెలల నుంచి మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన కార్డ్ అయిన రూపే కార్డ్ తో నిబంధనల ప్రకారం ఫ్రీగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. ఎన్పీసీఐ – ఎస్బీఐ ఐఆర్సీటీసీ సంయుక్తంగా ఈ కార్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ప్రయాణికులు ఎవరైతే ఎస్బీఐ ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన రూపే కార్డును వినియోగిస్తారో వాళ్లు ఉచితంగా లేదా తక్కువ ధరకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ తో పెట్రోల్, డీజిల్ పై దేశంలోని అన్ని బంకుల్లో ఒక శాతం ఛార్జీల మినహాయింపును పొందవచ్చు. ఒకే ట్యాప్ తో ఫ్లాట్ ఫాం, మెట్రో, టోల్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ కార్డ్ ద్వారా వినియోగదారులు పలు ఈ కామర్స్ లైట్లలో డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago