ఒక మహిళ పోలీసు ఉద్యోగం చేసినా ఇంటికి మాత్రం ఇల్లాలే కదా.. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర పోలీసు విభాగం గుర్తించింది. పోలీస్ ఫోర్స్లోని మహిళా సిబ్బందికి 8 గంటల పని వేళలను అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అంతకు ముందు మహారాష్ట్ర డీజీపీ సంజయ్ పాండే మహిళలకు హామీ కూడా ఇచ్చారు.
దీనిలో భాగంగానే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దీనిని అమలు చేస్తున్నామని, ఇవే పనివేళలను త్వరలో దశల వారిగా రాష్ట్రమంతటా అమల్లోకి తెస్తామని అతడు చెప్పారు. ఇదిలా ఉండగా..12 గంటల వరకు పని ఉన్నా.. చేస్తున్నామని.. కానీ అంతకు మించి కూడా మాతో పనులు చేయించుకుంటున్నారని.. దీంతో కుటుంబబాధ్యతల నిర్వహణపై పని భారం పుడుతోందని పలువురు మహిళా కానిస్టేబుళ్ల ఇటీవల డీజీపీ దృష్టికి తెచ్చినట్టు ఒక అధికారి తెలిపారు.
దీనిని పరిగణలోకి తీసుకొని పోలీసు అధికారులు ఆ పని వేళలలను 12 నుంచి 8 గంటలకు విషయమై సీనియర్ అధికారులతో పాండే చర్చించారు. దీంతో చివరకు ఇంటి బాధ్యతలను సమతుల్యం చేసుకునేలా మహిళా కానిస్టేబుళ్ల పనివేళలను 12 నుంచి 8 గంటలకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నాగపూర్, పుణె, అమరావతి, నవీ ముంబైలలో ఇప్పటికే 8 గంటల పనివేళలను విజయవంతంగా అమల్లోకి తెచ్చారు.
మొట్టమొదటగా నాగపూర్ లో ఆగస్టు 28 న అమలు చేశారు. ఆ అమలు విజయవంతంగా అయింది. దాని ఫలితాలను పరిగణలోకి తీసుకొని మిగతా చోట్ల కూడా అమలయ్యేలా చూడాలని ఉత్తర్వులు జారీ చేశారు.మరో నెలరోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…