భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్, గూగుల్, వాట్సాప్, ట్విట్టర్ పాటించాలని, లేకపోతే ఆ సంస్థల పై కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సూచించిన కొత్త నిబంధనలకు ట్విట్టర్ తప్ప ఇతర సంస్థలన్నీ నిబంధనలను పాటించాలనే అంగీకారానికి వచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు తమ నోడల్ అధికారి, ఫిర్యాదుల్ని పరిష్కరించే అధికారి, కంప్లయెన్స్ అధికారికి సంబంధించిన విషయాలను తెలియజేయాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలను పాటిస్తూ సంబంధిత అధికారులకు సంబంధించిన విషయాలను తెలియజేయడానికి అన్ని సోషల్ మీడియా సంస్థలు అంగీకారం తెలిపిన, ట్విట్టర్ మాత్రం అందుకు సమ్మతంగా లేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన కొత్త నిబంధనలను పాటించడం ద్వారా తమ ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టును వాట్సప్ ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ కూడా ఈ నిబంధనల వల్ల తమ ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వ్యాఖ్యానించింది.
ఈ నిబంధనల ప్రకారం భారతదేశంలో తమ సంస్థలో పని చేసే చీఫ్ కంపిలియన్స్ ఆఫీసర్లు (సీసీవో), కాంటాక్ట్ పర్సన్ (ఎన్సీపీ), ఫిర్యాదుల స్వీకరణ అధికారి (జీపీ) వివరాలను తెలియజేశాయి. కానీ ట్విట్టర్ మాత్రం కేవలం సీసీవో వివరాలను వెల్లడించక పోవడంతో ట్విట్టర్ ,కేంద్రం మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో వర్తించే చట్టానికి లోబడి ఉంటాం కానీ ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నట్టే సేవల్లో పారదర్శకత, చట్ట నిబంధనల్లో భావ ప్రకటనా స్వేచ్ఛ, గోప్యతను పరిరక్షించే సూత్రాల ద్వారా మేం మార్గనిర్దేశం చేస్తామని ట్విట్టర్ అధికార ప్రతినిధి ఈ సందర్భంగా తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…