Featured

పిల్లల్ని కంటే లక్షల రూపాయలు.. ఎక్కడంటే..!!

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంటే మరి కొన్ని దేశాల్లో మాత్రం సంవత్సరం సంవత్సరానికి తగ్గుతోంది. దేశంలో వృద్ధుల జనాభా పెరుగుతూ యువత తక్కువ సంఖ్యలో ఉండటం ఆయా దేశాల ప్రభుత్వాలను భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో సింగపూర్ ప్రభుత్వం పిల్లలను కనేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. పిల్లలను కనకుండా వాయిదా వేసుకుంటున్న వారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పిల్లలను కనేవారి కోసం ఏకంగా 3 వేల డాలర్లు(ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,50,000 రూపాయలు) ఇస్తామని ప్రకటించింది. సాధారణంగా సింగపూర్ జనాభా చాలా తక్కువ. గతంలో కూడా సింగపూర్ ప్రభుత్వం ఇలాంటి ఆఫర్లను ప్రకటించింది. అయితే ఆఫర్లు ప్రకటిస్తున్నా గత కొన్నేళ్లుగా సింగపూర్ లో జననాల రేటు తక్కువగా నమోదవుతోంది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల పిల్లలను కనాలనుకునే జంటలు ఆ నిర్ణయాలను వాయిదా వేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు వేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వాళ్లు పిల్లలను కనాలకుకోవడంపై పునరాలోచించేలా చేస్తున్నాయి. దీంతో బేబీ బోనస్ క్యాష్ గిఫ్ట్ పేరుతో సింగపూర్ ప్రభుత్వం గతంలో స్కీమ్ ను ఇచ్చింది. ఈ స్కీమ్ ద్వారా లక్షల రూపాయలు అక్కడి వివాహిత జంటలకు ఇస్తోంది. కరోనా వల్ల జననాల రేటు మరింత దిగజారే అవకాశం ఉందని భావించి “ది బేబీ సపోర్ట్ గ్రాంట్” పేరుతో మరో స్కీమ్ ను వివాహిత జంటలకు అందుబాటులోకి తెచ్చింది.

ఈ కొత్త స్కీమ్ ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ నెల వరకు అమలులో ఉండనుంది. సింగపూర్ లో పిల్లలను కనే వివాహిత జంటలకు ఏకంగా 13,000 సింగపూర్ డాలర్లు సొంతం కానున్నాయి. అయితే ఈ దేశాల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే మరికొన్ని దేశాల్లో జనాభాను తగ్గించే దిశగా చర్యలు చేపడుతుండటం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…

41 minutes ago

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

9 hours ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

9 hours ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

9 hours ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

9 hours ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

9 hours ago