ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల వల్ల దేశ ప్రజలందరూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉపాధిని కోల్పోయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఎంతోమంది విద్యార్థులు చదువును కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే ఎంతో మంది ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి చదువుకోవడం వల్ల విద్యార్థులకు చదువు భారంగా మారిపోయింది.ఈ విధంగా ప్రైవేట్ స్కూల్ కి వెళ్లి చదువుకునే విద్యార్థుల పట్ల ఒడిసా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే ఒడిసా ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో 15 శాతం ఫీజులు తగ్గించాలనీ ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు తగ్గించడం వల్ల ఎంతో మంది తల్లిదండ్రులకు కొంతవరకు ఆర్థిక భారం తగ్గుతుంది అన్న ఉద్దేశంతోనే రాష్ట్రప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ ఏడాది కరోనా ప్రభావం, లాక్ డౌన్ ఆంక్షల వల్ల పిల్లల చదువుల పై తీవ్రమైన ప్రభావం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒడిశా హైకోర్టు సైతం వార్షిక ఫీజులో మినహాయింపు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు జరగని పక్షంలో తల్లిదండ్రులు మరొకసారి కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల పట్ల ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దిశగా అన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తే దేశంలో ఎంతో మంది తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బంది తగ్గడమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా వారు చదువులు కొనసాగుతాయి.ఈ ఏడాది కూడా కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులను నిర్వహించనున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…