General News

రైతులు ఈ పంటలు పండిస్తే.. లక్షల్లో ఆదాయం పొందవచ్చు తెలుసా?

భారత దేశంలో ఎక్కువ మంది వ్యవసాయం పైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ క్రమంలోనే రైతులు సంవత్సరంలో మూడు పంటలను సాగు చేస్తుంటారు. అయితే ఇతర సీజన్ లతో పోలిస్తే ఖరీఫ్ సీజన్లో రైతులు అధికంగా పంట సాగుబడి చేస్తారు. పంటలను సాగు చేయడానికి ఖరీఫ్ ఎంతో అనువైన కాలం. ప్రస్తుత కాలంలో రైతులుపంటపై ఎక్కువభాగం పెట్టుబడులు పెట్టడం వల్ల వారికి పెద్దగా లాభాలు రావడం లేదు.ఈ క్రమంలోనే తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందే పంటలను సాగు చేయడం ద్వారా రైతులు లక్షల్లో లాభాలను పొందవచ్చు. ఖరీఫ్ సీజన్లో ఎటువంటి పంటకు సానుకూలం, ఏ పంటలు పెట్టడం ద్వారా ఆదాయం పొందవచ్చు అనేది తెలుసుకుందాం..

ఖరీఫ్ సీజన్లో కలబంద సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలను పొందవచ్చు. జులై నుంచి ఆగస్టు నెల మధ్యలో కలబంద సాగు చేయడం ద్వారా ఎకరాకు ఏకంగా 2 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.ఎన్నో ఔషధ గుణాలు దాగిఉన్న కలబందను వివిధ రకాల ఔషధాలలో సౌందర్య ఉత్పత్తుల్లో విరివిగా వాడటం వల్ల ఈ పంటకు ఎంతో డిమాండ్ ఉంటుంది.

మైదాన ప్రాంతాలలో విత్తనాల ద్వారా పండించే కౌంచ్ పంట ద్వారా ఎకరాకు మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. జూన్ నుంచి జూలై మధ్యలో ఈ పంటను సాగు చేయడానికి ఎంతో అనువైన సమయం. ఈ పంటను సాగు చేయడానికి ఎకరానికి 3 కిలోల నుంచి 5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.

మన దేశాలలో పాటు ఇతర దేశాలలో కూడా పండించే ఔషధ పంటలలో లెమన్ గ్రాస్ ఒకటి. ఎకరా లెమన్ గ్రాస్ పంటకు 30వేల రూపాయల నుంచి 40వేల రూపాయల పెట్టుబడి పెడితే ఒక ఎకరానికి సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఈ పంటను సాగు చేయడానికి ఖరీఫ్ కాలం ఎంతో అనువైనది. ఈవిధంగా ఖరీఫ్ సీజన్లో ఈ పంటలు పండించడం ద్వారా రైతులు లక్షల్లో ఆదాయం పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

2 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

2 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

2 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

2 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

2 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

2 hours ago