భారత దేశంలో ఎక్కువ మంది వ్యవసాయం పైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ క్రమంలోనే రైతులు సంవత్సరంలో మూడు పంటలను సాగు చేస్తుంటారు. అయితే ఇతర సీజన్ లతో పోలిస్తే ఖరీఫ్ సీజన్లో రైతులు అధికంగా పంట సాగుబడి చేస్తారు. పంటలను సాగు చేయడానికి ఖరీఫ్ ఎంతో అనువైన కాలం. ప్రస్తుత కాలంలో రైతులుపంటపై ఎక్కువభాగం పెట్టుబడులు పెట్టడం వల్ల వారికి పెద్దగా లాభాలు రావడం లేదు.ఈ క్రమంలోనే తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందే పంటలను సాగు చేయడం ద్వారా రైతులు లక్షల్లో లాభాలను పొందవచ్చు. ఖరీఫ్ సీజన్లో ఎటువంటి పంటకు సానుకూలం, ఏ పంటలు పెట్టడం ద్వారా ఆదాయం పొందవచ్చు అనేది తెలుసుకుందాం..

ఖరీఫ్ సీజన్లో కలబంద సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలను పొందవచ్చు. జులై నుంచి ఆగస్టు నెల మధ్యలో కలబంద సాగు చేయడం ద్వారా ఎకరాకు ఏకంగా 2 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.ఎన్నో ఔషధ గుణాలు దాగిఉన్న కలబందను వివిధ రకాల ఔషధాలలో సౌందర్య ఉత్పత్తుల్లో విరివిగా వాడటం వల్ల ఈ పంటకు ఎంతో డిమాండ్ ఉంటుంది.
మైదాన ప్రాంతాలలో విత్తనాల ద్వారా పండించే కౌంచ్ పంట ద్వారా ఎకరాకు మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. జూన్ నుంచి జూలై మధ్యలో ఈ పంటను సాగు చేయడానికి ఎంతో అనువైన సమయం. ఈ పంటను సాగు చేయడానికి ఎకరానికి 3 కిలోల నుంచి 5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.
మన దేశాలలో పాటు ఇతర దేశాలలో కూడా పండించే ఔషధ పంటలలో లెమన్ గ్రాస్ ఒకటి. ఎకరా లెమన్ గ్రాస్ పంటకు 30వేల రూపాయల నుంచి 40వేల రూపాయల పెట్టుబడి పెడితే ఒక ఎకరానికి సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఈ పంటను సాగు చేయడానికి ఖరీఫ్ కాలం ఎంతో అనువైనది. ఈవిధంగా ఖరీఫ్ సీజన్లో ఈ పంటలు పండించడం ద్వారా రైతులు లక్షల్లో ఆదాయం పొందవచ్చు.































