గతకొన్నిరోజులుగా ఎండలు దంచికోట్టాయి. అయితే భానుడు కాస్త శాంతించడంతో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. భారీ వర్షాల కారణంగా వరదలకు వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు ముంపు ప్రాంత ప్రజలు. తాజాగా ఒక హైవే అందరూ చూస్తుండగా కుప్పకూలిపోయింది.
అరుణాచల్ ప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షాల ధాటికి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నగరం ఇటానగర్లో అనేక భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో ఇటానగర్ గాంధీ పార్క్ జాతీయ రహదారి 415లో ఓ రోడ్డు ఒక్కసారిగా కూలిపోయింది. అలాగని ఆ రోడ్డు బ్రిటీష్ కాలం నాటిది కాదు ఈ మధ్యనే కొత్తగా నిర్మించారు. అయితే తాజగా కురిసిన వర్షాల ధాటికి రోడ్డు కుంగిపోయి ఈ ప్రమాదం జరిగిందని హైవే అధికారులు అంచనా వేస్తున్నారు.
మరో వైపు ఒక్కసారిగా రోడ్డు కుప్పకూలిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ సమయంలో వాహనదారులు కాస్త అలర్ట్ గా ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా, వర్షానికి జాతీయ రహదారి రోడ్డు కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సదరు రహదారిని నిర్మించిన నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…