గతకొన్నిరోజులుగా ఎండలు దంచికోట్టాయి. అయితే భానుడు కాస్త శాంతించడంతో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. భారీ వర్షాల కారణంగా వరదలకు వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు ముంపు ప్రాంత ప్రజలు. తాజాగా ఒక హైవే అందరూ చూస్తుండగా కుప్పకూలిపోయింది.
అరుణాచల్ ప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షాల ధాటికి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నగరం ఇటానగర్లో అనేక భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో ఇటానగర్ గాంధీ పార్క్ జాతీయ రహదారి 415లో ఓ రోడ్డు ఒక్కసారిగా కూలిపోయింది. అలాగని ఆ రోడ్డు బ్రిటీష్ కాలం నాటిది కాదు ఈ మధ్యనే కొత్తగా నిర్మించారు. అయితే తాజగా కురిసిన వర్షాల ధాటికి రోడ్డు కుంగిపోయి ఈ ప్రమాదం జరిగిందని హైవే అధికారులు అంచనా వేస్తున్నారు.
మరో వైపు ఒక్కసారిగా రోడ్డు కుప్పకూలిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ సమయంలో వాహనదారులు కాస్త అలర్ట్ గా ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా, వర్షానికి జాతీయ రహదారి రోడ్డు కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సదరు రహదారిని నిర్మించిన నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…