AP: 2019 ఎన్నికలలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి వాలంటీర్ వ్యవస్థను తీసుకోవచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన ప్రజల ముంగిటికే అనే విధంగా ప్రజలకు అవసరమైనటువంటి పెన్షన్ రేషన్ ఇతర సర్టిఫికెట్లను కూడా వాలంటీర్ల ద్వారానే ఇంటి వరకు చేర్చారు.
ఇలా వాలంటీర్ వ్యవస్థను మొదట్లో తిరస్కరించినటువంటి ప్రతిపక్షాలు ఎన్నికల సమయానికి వాలంటీర్ వ్యవస్థ పై ప్రశంసలు కురిపించడమే కాకుండా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం 10 వేలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ గురించి ఇప్పటివరకు ఎలాంటి విషయాలను కూడా అధికారికంగా తెలియజేయలేదు. త్వరలోనే వాలంటీర్ వ్యవస్థ గురించి అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. ఇక త్వరలోనే వాలంటీర్లను నియమిస్తామని వెల్లడించడంతో గతంలో వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి పలువురు వాలంటీర్లు ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున లేఖలు రాస్తున్నారు.
డిగ్రీ అర్హత..
గతంలో వైసీపీ నాయకులు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఎదురు తిరిగారు. ఇక త్వరలోనే నియమించబోయే వాలంటీర్లుగా తమను విధులలోకి తీసుకోవాలని కోరుతూ వాలంటీర్లు లేఖలు రాయటం గమనార్హం. అయితే చంద్రబాబు నాయుడు 10,000 రూపాయల వేతనం చెల్లించడమే కాకుండా వాలంటీర్ గా చేయాలి అంటే డిగ్రీ అర్హత కూడా ఉండాలంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…