He who misbehaves with me... I should kill Poornachander..." - the anguish of anchor Sukshita's daughter
తెలుగు యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు కొనసాగుతూనే ఉంది. తాజాగా స్వేచ్ఛ కుమార్తె మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తల్లి మృతికి పూర్తిగా పూర్ణచందర్నే బాధ్యతవహించాల్సి ఉంది అని స్పష్టం చేసింది. అంతేకాదు, అతడిపై తీవ్రమైన కోపంతో “అతన్ని చంపేయాలని ఉంది” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
“చంపేముందు, మా అమ్మ చెప్పుతో, నా చెప్పుతో అతన్ని కొట్టాలని ఉంది” అంటూ ఆమె చెప్పిన మాటలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. తాను ఎంతో మానసిక వేధనకు గురైయ్యానని, పూర్ణచందర్ తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించింది. తల్లితో పాటు తాను కూడా చాలా బాధలు అనుభవించానని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సంఘటనతో సంబంధించి పూర్ణచందర్ ప్రవర్తన, స్వేచ్ఛ బలవన్మరణం వరకు ఆమెను వెంటాడిన మానసిక పరిస్థితి, ఆ కుటుంబం లోని బాధ్యతలన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. న్యాయపరమైన దర్యాప్తుతోపాటు, ఇటు పబ్లిక్ కోర్టులోనూ పూర్ణచందర్పై నిందలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి.
స్వేచ్ఛ కుమార్తె మాటల్లో వ్యక్తమైన ఆవేదన, తల్లి కోల్పోయిన వేదన ఇప్పుడు సోషల్ మీడియాలో హృదయాల్ని కదిలిస్తోంది. ఈ కేసు ఎంత త్వరగా, నిజానిజాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సిందే.
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…