Heartbreaking story of Air India plane crash victim!
Plane Crash : టాటా గ్రూప్ ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక మహిళ వారికే రెండు కోట్ల రూపాయలు తిరిగి ఇస్తానని చెబుతోంది. ఆమె డిమాండ్ ఏమిటంటే… “మీరు నా తండ్రిని ప్రాణంతో తిరిగి తెచ్చేయండి!” ఆమె తండ్రి ఈ ప్రమాదంలో మరణించారు. అతని శరీరం కూడా గుర్తించలేనంతగా కాలిపోయింది. ఆమె కన్నీళ్లతో చెప్పిన మాటలు ఎవరి హృదయాన్ని కదిలించకపోవు.
“మీ పరిహారం నాకు ఎందుకు? నా తండ్రి లేకుండా ఆ డబ్బు ఏమి చేస్తుంది? నేను మీకు రెండు కోట్లిస్తాను, కానీ మీరు నా నాన్నను బతికించి తిరిగి తెండి! ఆయన నవ్వులు, ఆప్యాయత, అన్నీ నాకు తిరిగి కావాలి…” అంటూ ఫాల్గుని అనే ఆ మహిళ మనస్ఫోటం చేసుకుంది.
ఫాల్గునితో పాటు అనేక బాధిత కుటుంబాలు అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ వద్ద ఎదురు చూస్తున్నారు. విమానంలో మరణించిన వారి శరీరాలు గుర్తించడం కష్టమైన స్థితిలో ఉన్నాయి. డీఎన్ఏ టెస్టింగ్ జరుగుతోంది, కానీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. కుటుంబ సభ్యులు ఫలితాల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. “ఇంకెప్పుడు మా వాళ్లను ఇస్తారు? ఇంత జాప్యం ఎందుకు?” అని వారు అధికారులను కసితో ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, అధికారులు తమ బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెబుతున్నారు. “240 మృతదేహాల డీఎన్ఏ టెస్టులు పూర్తయ్యాయి. మ్యాచింగ్ పూర్తయిన వెంటనే శవాలను అప్పగిస్తాం” అని వారు చెప్పారు. కానీ బాధిత కుటుంబాలకు ఇది ఎంతో కష్టమైన కాలం.
ఈ విషాదంలో ప్రతి ఒక్కరి హృదయం బాధతో నిండిపోతోంది. డబ్బు కాదు, వారి ప్రియమైనవారి జీవితాలే వారికి కావాలి. ఈ దుఃఖం ఎప్పటికీ మరచిపోలేనిది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…