దేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మధుమేహంతో బాధపడే వాళ్లు తప్పనిసరిగా తీసుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని ఆహార పదార్థాలను మధుమేహ రోగులు అస్సలు తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శీతాకాలంలో మధుమేహ రోగులు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
టైప్ 2 డయాబెటిస్ ను అదుపులో ఉంచాలంటే షుగర్ లెవెల్స్ పెంచని ఆహార పదార్థాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. మధుమేహ రోగులు పూరీ, మక్కీ రోటీ, వేడివేడి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఈ మూడు షుగర్ లెవెల్స్ ను వేగంగా పెంచుతాయి. నారింజ రసంను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. నారింజలో విటమిన్ సితో పాటు గ్లూకోజ్ ను విడుదల చేసే చక్కెరలు కూడా ఎక్కువగా ఉంటాయి.
నారింజ పండ్లలో ఫైబర్, ప్రోటీన్ తక్కువగా ఉండటం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. మధుమేహ రోగులు వేగించి ఫ్రై చేసిన ఆహారపదార్థాలను తీసుకోకూడదు. వేగించి ఫ్రై చేసిన ఆహార పదార్థాల్ల్లో ట్యాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ట్యాన్స్ ఫ్యాట్స్ ఇన్ ఫ్లమేషన్ ను పెంచుతాయి. ఇలా జరగడం వల్ల శరీరంలో కణాలు ఇన్సులిన్ కు స్పందించవు.
శరీరంలో కణాలు స్ప్ందించకపోతే గ్లూకోజ్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. వీటితో పాటు పాస్తా, రైస్, వైట్ బ్రెడ్ ను డయాబెటిస్ రోగులు తినకూడదు. చక్కెరతో తయారైన పానీయాలను సైతం అస్సలు తీసుకోకూడదు. ఎక్కువగా ప్రాసెస్ చేసిన తృణధాన్యాలను, ఎక్కువ రుచి కలిగిన కాఫీలను, డ్రై ఫ్రూట్స్ ను, సహజసిద్ధమైన చక్కెరను కలిగి ఉన్న తేనెను, ప్యాక్ చేయబడిన స్నాక్స్ ను, ఫ్రెంచ్ ఫ్రైస్ ను, పండ్ల రసాలు, ఫ్రూట్ ఫ్లేవర్ ఉన్న పెరుగును తీసుకోకూడదు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…