దేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మధుమేహంతో బాధపడే వాళ్లు తప్పనిసరిగా తీసుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని ఆహార పదార్థాలను మధుమేహ రోగులు అస్సలు తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శీతాకాలంలో మధుమేహ రోగులు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
టైప్ 2 డయాబెటిస్ ను అదుపులో ఉంచాలంటే షుగర్ లెవెల్స్ పెంచని ఆహార పదార్థాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. మధుమేహ రోగులు పూరీ, మక్కీ రోటీ, వేడివేడి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఈ మూడు షుగర్ లెవెల్స్ ను వేగంగా పెంచుతాయి. నారింజ రసంను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. నారింజలో విటమిన్ సితో పాటు గ్లూకోజ్ ను విడుదల చేసే చక్కెరలు కూడా ఎక్కువగా ఉంటాయి.
నారింజ పండ్లలో ఫైబర్, ప్రోటీన్ తక్కువగా ఉండటం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. మధుమేహ రోగులు వేగించి ఫ్రై చేసిన ఆహారపదార్థాలను తీసుకోకూడదు. వేగించి ఫ్రై చేసిన ఆహార పదార్థాల్ల్లో ట్యాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ట్యాన్స్ ఫ్యాట్స్ ఇన్ ఫ్లమేషన్ ను పెంచుతాయి. ఇలా జరగడం వల్ల శరీరంలో కణాలు ఇన్సులిన్ కు స్పందించవు.
శరీరంలో కణాలు స్ప్ందించకపోతే గ్లూకోజ్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. వీటితో పాటు పాస్తా, రైస్, వైట్ బ్రెడ్ ను డయాబెటిస్ రోగులు తినకూడదు. చక్కెరతో తయారైన పానీయాలను సైతం అస్సలు తీసుకోకూడదు. ఎక్కువగా ప్రాసెస్ చేసిన తృణధాన్యాలను, ఎక్కువ రుచి కలిగిన కాఫీలను, డ్రై ఫ్రూట్స్ ను, సహజసిద్ధమైన చక్కెరను కలిగి ఉన్న తేనెను, ప్యాక్ చేయబడిన స్నాక్స్ ను, ఫ్రెంచ్ ఫ్రైస్ ను, పండ్ల రసాలు, ఫ్రూట్ ఫ్లేవర్ ఉన్న పెరుగును తీసుకోకూడదు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…