Nagachaitanya: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు నాగచైతన్య ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతోమంది సక్సెస్ అందుకున్నారు. నటుడిగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాగచైతన్య తన తాతయ్యల గురించి అలాగే తన తల్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాను చిన్నప్పటి నుంచి తన తాతయ్యలు రామానాయుడు నాగేశ్వరరావు గారి నుంచి ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు. ముఖ్యంగా వారు సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతూ ఉండేవారు ఒకరు మనకు సమయం ఇచ్చారు అంటే వారు ఎన్నో పనులను మానుకొని వస్తుంటారని అందుకే మనం సమయానికి రెస్పెక్ట్ ఇవ్వాలని తాతయ్య వాళ్ళు చెబుతూ ఉండేవారని తెలిపారు.
ఇక తాను 18 సంవత్సరాల వరకు అమ్మ దగ్గరే పెరిగాను. అమ్మ నన్ను పెంచింది. అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎతిక్స్ ఫాలో అవుతారు. క్రమశిక్షణ, టైం సెన్స్, ఒక పర్సన్ కు రెస్పెక్ట్ ఇవన్నీ అమ్మే నేర్పించారు. మీలో సెన్సిటివ్ నెస్, కొంచెం మీలో మీకు మాత్రమే సర్కిల్ గీసుకుంటూ ఉండిపోయేది అంతా అమ్మ నుంచే వచ్చాయా అని యాంకర్ అడగ్గా.. లేదు అని చైతూ చెప్పాడు.
స్నేహితులు ఎక్కువగా లేరు..
చిన్నప్పుడు నాకు చాలా సిగ్గు ఎక్కువ అందుకే ఎవరి దగ్గర ఏ విషయాల గురించి ఓపెన్ కానని తెలిపారు. నాకు బాగా కంఫర్ట్ ఉన్న వారి దగ్గర మాత్రమే నా విషయాలన్నీ చెప్పుకునేవాడిని. ఇక అందరిలాగా నాకు 30, 40 మంది ఫ్రెండ్స్ ఉండాలని ఎప్పుడూ కోరుకోను. ఉన్నది ముగ్గురు నలుగురు ఆయన చాలా నిజాయితీగా ఉండాలని నేను చేసే ఏ విషయమైనా ఇది తప్పు ఒప్పు అని చెప్పే స్నేహితులు ఉంటే చాలని అందుకే తనకు ఎక్కువగా స్నేహితులు లేరని నాగచైతన్య ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…