దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్100 చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో హీరోయిన్ పాత్ర అద్బుతం. ఆ పాత్రను తెరకెక్కించిన తీరు.. అమోఘం అని చెప్పాలి. సినిమా అంత పెద్ద విజయవంతం కావడానికి కారణం కూడా అదే. అయితే ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వంలో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే.
అదే ‘మహాసముద్రం’. దీనిలో సిద్దార్థ్, శర్వానంద్ నటిస్తున్నారు. మూడేళ్ల తర్వాత అతడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో అదితిరావ్ హైదరీ- అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా జగపతిబాబు, రావు రమేష్ లాంటి సీనియర్లు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రామేష్ గూని పాత్రలో నటించడం మరో విశేషం. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
దీనిలో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా హాజరయ్యాడు. అజయ్ భూపతి తనకు రీ బర్త్ ఇచ్చాడని.. అతడు లేకపోతే నాకు ఈ హోదా ఉండేది కాదని అతడిని పొగిడారు. అంతేకాదు.. ఆర్ ఎక్స్ 100 సినిమా షూటింగ్ సమయంలోనే తను మహా సముద్రం కథ విన్నానని.. ఎంతో బాగుందన్నారు. ఈ సినిమాలో తనను తీసుకోకపోవడంతో తాను అలిగానని చమత్కరించారు.
ఇదిలా ఉండగా.. అజయ్ భూపతి గురించి మాట్లాడుతూ.. ఆర్ ఎక్స్ 100 సినిమా విడుదల సమయంలో ఈ సినిమా హిట్ కాకపోతే తాను గెదెలు కాసుకుంటానని.. చెప్పాడని.. అతడు చెప్పినట్లుగానే సినిమా బంపర్ హిట్ అయిందన్నారు. ఇప్పుడు కూడా అజయ్ అలానే చెబుతున్నాడని కార్తికేయ అన్నారు. సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం తనకు ఉందంటూ అతడు ఆశాభావం వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…