టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ప్రేక్షకులకు ఎప్పటి నుంచో సుపరిచితుడే. అతడితో పాటు ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, ‘వెన్నెల’ రామారావు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. వీరి ముగ్గురు ఇందులో అంగవైకల్యం కలిగి పాత్రలో నటించారు. ఇటీవల ఇది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విశేషాధారణ పొందింది.
ట్రైలర్ తోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం ఓటీటీలో విడుదలయి ప్రేక్షకులను మెప్పిస్తోంది. వీరి ముగ్గురు ఓ మర్డర్ కేసులో ఇరుక్కొని అక్కడ నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు.. అక్కడ పరిణామాలు ఏమి సంభవించాయి.. ఎలాంటి పరిస్థితులను వాళ్లు ఎదుర్కొన్నారు అనేది స్టోరీ. కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన “ముగ్గురు మొనగాళ్లు”లో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా, దీక్షిత్ మూగవాడిగా, రామారావు అంధుడిగా… ఇలా ముగ్గురూ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించారు. రిత్విష్శర్మ, శ్వేత వర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు.
రాజా రవీంద్ర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ప్రధాన పాత్ర పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి.. సురేష్ బొబ్బిలి స్వరాలు అందించారు. ‘చిత్రమందిర్ స్టూడియోస్’ బ్యానర్ పై పి. అచ్యుత్ రామారావు నిర్మాతగా దీనిని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో నెంబర్ 2 గా ట్రెండ్ అవుతోంది. మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకోవడంతో ఆ చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. దీనికి గరుడు వేగ మేమ్ అంజి అందించిన విజువల్స్ అమోఘం అని చెప్పుకోవాలి.
దీనిలో ఇంకా.. నిజర్, జెమిని సురేష్, జోష్ రవి, భద్రం, సూర్య, జబర్తస్త్ సన్నీ నటించారు. దీనికి కో ప్రోడ్యూసర్లుగా తేజ చీపురుపల్లి,రవీందర్రెడ్డి అద్దుల వ్యవహరించారు. దినిలో బ్యాగ్రౌండ్ స్కోర్ గా చిన్నా, ఎడిటర్ గా బి. నాగేశ్వర రెడ్డి , ఆర్ట్ డైరెక్టర్గా నాని పనిచేశారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…