హీరో ప్రభాస్ ఇటీవల ఓ విల్లాను అధిక ధరకు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ప్లాట్ను కొనుగోలు చేసి వారాల తరబడి ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేష్ బాబు జూబ్లీహిల్స్లో రూ.26 కోట్లతో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారట. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 17, 2021 న జరిగినట్లు తెలిసింది. యర్రం విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.26 కోట్లతో 1442 గజాల స్థలాన్ని మహేష్బాబు కొనుగోలు చేసినట్లు ఇంటి భూమి రిజిస్ట్రేషన్ పత్రాలను బట్టి తెలుస్తోంది.
రూ.1.43 కోట్లు స్టాంపు డ్యూటీ కింద.. బదిలీ కింద రూ. 39 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో నివాస స్థలానికి సంబంధించి అక్కడ ఒక్కో ఫ్లాట్ 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటాయి. దాదాపు గజం రూ.1.50లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది.
మొదట అక్కడ విక్రాంత్ రెడ్డి పాత ఇంటిని కూల్చేసి కొత్తది కడదాం అనుకున్నాడట. కాని కొత్తగా నిర్మాణ పనులు చేపట్టకుండా.. ఆ ఇంటి స్థలాన్ని మహేశ్ బాబుకు అమ్మేశాడు. అయితే ఈ ఇంటి కొనుగోలు వార్తలపై మహేష్ బాబు ఇంకా స్పందించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఆ తర్వాత రాజమౌళితో ఓ సినిమా చేయనున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…