Featured

Heroine Amani : మా నాన్నకి ఇద్దరు భార్యలు, మొదటి భార్య పిల్లల వద్ద నాన్నను వదిలేసి… మా అమ్మాను చెన్నై తీసుకుని వెళ్ళిపోయా…: హీరోయిన్ ఆమని

Heroine Amani : ‘జంబలకిడి పంబ’ సినిమతో హీరోయిన్ గా తెలుగులో అడుగుపెట్టిన ఆమని ఆ తరువాత మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం వంటి నటించేందుకు స్కోప్ ఉన్న పాత్రలతో ఒదిగిపోయి నటించి సగటు తెలుగింటి మహిళగా అందరి మదిలో నిలిచిపోయింది. హీరోయిన్ గా దాదాపు అందరు హీరోలతో నటించిన ఆమని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. ఇక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఆ నలుగురు’ సినిమాలో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అలరిస్తున్నారు. తన పాత సినిమా విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మా నాన్న మరణం బాగా బాధించింది…

హీరోయిన్ అవ్వాలనుకున్నప్పుడు మొదట్లో తండ్రి ఒప్పుకోకపోవడం ఆ తరువాత కొద్దిగా అవకాశాలు వచ్చిన తరువాత ఆమని తండ్రి కూతురుకి నిజంగానే సినిమాల్లో నటించాలనే పట్టుదల చూసి ఆమెను ఎంకరేజ్ చేశారట. ఇక తన తండ్రితో ఎక్కువ బాండింగ్ ఉండేదంటూ చెప్పిన ఆమని జీవితంలో బాగా బాధించిన విషయం తండ్రి మరణించినపుడు అంటూ చెప్పారు. ఆమని తండ్రికి ఇద్దరు భార్యలు కాగా ఆమని రెండో భార్య కూతురు. ఇంకా హీరోయిన్ గా అప్పుడే అడుగులేస్తున్న సమయంలో తండ్రి అనారోగ్యం పాలవడంతో మొదటి భార్య పిల్లల వద్దకు నాన్నాని పంపి నేను చెన్నై వెళ్లాల్సి వచ్చింది.

ఆ సమయంలో ఆర్థికంగా నేను ఇంకా మంచి స్థితిలో లేకపోవడం వల్ల కొద్ది రోజులు ఆగండి నాన్న తీసుకెళ్తా అని చెప్పేదాన్ని. మా అన్న వాళ్ళు ఆయనను బాగా చూసుకుంటారు కానీ మాతో ఎక్కువ అఫెక్షన్ ఉండటం వల్ల మాకు దూరంగా ఉండటం అలాగే అనారోగ్యం వల్ల మరణించారు అంటూ ఆమని ఎమోషనల్ అయ్యారు. నేను హీరోయిన్ గా సక్సెస్ అయ్యాక మా నాన్న చూసి ఉంటే బాగుండేదని బాగా బధేసింది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

2 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

3 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

4 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

4 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

5 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

5 hours ago