Amani: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు వారి గురించి వచ్చిన వార్తలు నిజం కాగా మరికొన్ని ఆ వాస్తవమని సెలబ్రిటీలు వారి గురించి వచ్చే వార్తలను ఖండిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటి సౌందర్య ఒకరు.
సౌందర్య కన్నడ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ఎన్నో తెలుగు సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఈమె స్టార్ హీరోలందరి సరసన ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక అప్పట్లో సౌందర్య జగపతిబాబుతో కలిసి ఎక్కువగా సినిమాలలో నటించడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉంది అంటూ వార్తలు వచ్చాయి.
ఈ విధంగా వీరిద్దరి మధ్య ఎఫైర్ కొనసాగుతుందని అప్పటికే జగపతిబాబుకు పెళ్లి అయి పిల్లలు ఉన్నప్పటికీ తిరిగి సౌందర్యను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై సౌందర్య ప్రాణ స్నేహితురాలు ఆమని స్పందించారు. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ జగపతిబాబు సౌందర్య మధ్య ఎఫైర్ ఉందని వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.
ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా…
వీరిద్దరూ కలిసి ఎక్కువ సినిమాలలో నటించడం వల్ల అలా వార్తలు వచ్చాయి తప్ప వీరిద్దరూ మధ్య ఎలాంటి సంబంధం లేదని సౌందర్యకు ముందు ఫ్యామిలీని ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అంటూ ఈమె తెలియజేశారు. సౌందర్య చాలా మంచి వ్యక్తిత్వం కల అమ్మాయి దేవుడు తనకు బదులు నన్ను తీసుకొని వెళ్ళిపోయినా బాగుండేది అంటూ ఈ సందర్భంగా సౌందర్య మరణాన్ని తలుచుకొని ఆమని ఎమోషనల్ అయ్యారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…