Featured

పాలు,పెరుగు,చేపలు ఒకేసారి తింటున్నారా…ఈ సమస్యలు తప్పవు?

నిజానికి మనం చేసే ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది. ఎంత చిన్న పని అయినా పద్ధతి పద్ధతి ప్రకారం చేస్తేనే దాని నుంచి మనం సంపూర్ణ ప్రతిఫలం పొందవచ్చు. అలాగే మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం అయినా, త్రాగే నీరు అయినా ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి అప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం.ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఆహారం తీసుకునే విషయంలో కొన్ని చిన్నచిన్న నియమాలు పాటిస్తే అనారోగ్యం సమస్యలకు దూరంగా ఉండవచ్చుననీ, ముఖ్యంగా జీర్ణ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

భారతీయ ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు భోజనానికి అరగంట ముందు, అరగంట తరువాత మాత్రమే మంచినీరు తాగాలి. భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబారతాయి. దీనివల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం అవడంలో సమస్యలు ఏర్పడతాయి.అదేవిధంగా అధిక ప్రోటీనులు కలిగిన పాలు, పండ్లు మరియు పాలు, చేపలు, పెరుగు. అలాగే అధిక కొవ్వు పదార్థాలతో కలిసి ఏవిధమైన ఆహారాన్ని తీసుకోకూడదు వీటిని కలిపి తినడం వల్ల సరిగా జీర్ణం కాక గ్యాస్టిక్ వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఆయుర్వేద వైద్యుల సూచన ప్రకారం ఆహారం ఆకలి వేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి. సమయానికి తినాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత తింటే జీవక్రియ రేటు తగ్గి ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆహారం తినేటప్పుడు టీవీ చూడడం, ఫోన్లో మాట్లాడడం, పుస్తకాలు చదవడం మంచి పద్ధతి కాదు ఇలా చేయడం వల్ల ఎంత తింటున్నారో తెలియక ఎక్కువ తిని అధిక బరువు సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆహారం తినేటప్పుడు సాధ్యమైనంతవరకు నిశ్శబ్దంగా, ప్రశాంతమైన వాతావరణంలో కంఫర్ట్ గా కూర్చుని తినడం మంచిది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

13 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

13 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

13 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

13 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

13 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

16 hours ago