తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నిత్యం సామాజిక సేవలో ఎంతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎవరికైనా ఏదైనా ఆపద ఉందంటే వెంటనే స్పందించి వారికి సహాయం చేస్తుంటారు. ప్రతిభ దాగి ఉన్న యువతను బయటకు వెలికి తీయడంలో కేటీఆర్ ముందుంటారు.
తాజాగా గత నెలలో మెదక్ జిల్లాకు చెందిన ఒక గాయని తన స్వరంతో అద్భుతంగా పాట పాడిన సంగతి తెలిసిన కేటీఆర్ వెంటనే ఆ వీడియోను సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్ లకు ట్యాగ్ చేస్తూ ఇలాంటి ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించండి అని కోరారు. కేటీఆర్ చేసిన ట్వీట్ కి దేవిశ్రీప్రసాద్ స్పందిస్తూ… తప్పకుండా తనకు అవకాశం కల్పిస్తానని రీట్వీట్ చేశారు.
నాడు ఇచ్చిన మాటను దేవి శ్రీ ప్రసాద్ నేడు నిలబెట్టుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన ఈ గాయనినీ
వెతికి పట్టుకుని మరీ తన షోలో పాట పాడించానని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని కేటీఆర్కు దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.ఈ విధంగా దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మాటపై నిలబడటంతో కేటీఆర్ ఎంతో సంబరపడి అతని పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ మీ సపోర్ట్ ఎప్పటికి మరువలేము.. మీ సపోర్ట్ కారణంగానే అంత మంచి గాయనిని మాకు తెలియజేశారు అంటూ దేవి పేర్కొన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…