తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నిత్యం సామాజిక సేవలో ఎంతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎవరికైనా ఏదైనా ఆపద ఉందంటే వెంటనే స్పందించి వారికి సహాయం చేస్తుంటారు. ప్రతిభ దాగి ఉన్న యువతను బయటకు వెలికి తీయడంలో కేటీఆర్ ముందుంటారు.
తాజాగా గత నెలలో మెదక్ జిల్లాకు చెందిన ఒక గాయని తన స్వరంతో అద్భుతంగా పాట పాడిన సంగతి తెలిసిన కేటీఆర్ వెంటనే ఆ వీడియోను సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్ లకు ట్యాగ్ చేస్తూ ఇలాంటి ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించండి అని కోరారు. కేటీఆర్ చేసిన ట్వీట్ కి దేవిశ్రీప్రసాద్ స్పందిస్తూ… తప్పకుండా తనకు అవకాశం కల్పిస్తానని రీట్వీట్ చేశారు.
నాడు ఇచ్చిన మాటను దేవి శ్రీ ప్రసాద్ నేడు నిలబెట్టుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన ఈ గాయనినీ
వెతికి పట్టుకుని మరీ తన షోలో పాట పాడించానని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని కేటీఆర్కు దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.ఈ విధంగా దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మాటపై నిలబడటంతో కేటీఆర్ ఎంతో సంబరపడి అతని పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ మీ సపోర్ట్ ఎప్పటికి మరువలేము.. మీ సపోర్ట్ కారణంగానే అంత మంచి గాయనిని మాకు తెలియజేశారు అంటూ దేవి పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…