మారుతున్న జీవన గమనంలో పని ఒత్తిడి కారణంగా మనం తీసుకునే ఆహారం సరిపోదు తద్వారా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక వ్యాధులకు కారణం కావచ్చు. దాన్ని అధిగమించడానికి అదనపు ఆహారం చాలా అవసరం అదనపు ఆహారంగా పొద్దున బ్రేక్ ఫాస్ట్ తర్వాత లంచ్ కు మధ్యలో మరియు లంచ్ కు రాత్రి డిన్నర్ కు మధ్యలో అత్యధిక ప్రోటీన్స్ కలిగిన ఆహారాన్ని స్నాక్స్ గా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయిన ప్రోటీన్, విటమిన్స్ ,మినరల్స్ సమృద్ధిగా అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
బాదంపప్పు లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, యాంటిఆక్సిడెంట్స్, విటమిన్స్, పుష్కలంగా లభిస్తాయి. కేలరీలు తక్కువగా ఉండే బాదంపప్పును అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. బాదంపప్పు రాత్రి నానబెట్టి మరునాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత స్నాక్స్ గా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మీ శరీరానికి మేలు చేసి అధిక బరువును కూడా తగ్గిస్తాయి.శనగల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ వీటిని నానబెట్టి లేద ఉడికించి రోజు తీసుకుంటే మనలోఎనర్జీ బూస్ట్ జరుగుతుంది.
ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అదనంగా12 గ్రాముల ప్రొటీన్ లభించినట్లే. కర్జూరం ఉదయం సాయంత్రం అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు.వారానికి కనీసం రెండుసార్లయినా వీటిని తినడం వల్ల ఎర్ర రక్తకణాలు అభివృద్ధి చెంది అనీమియాను దూరం చేస్తుంది. బరువు తగ్గాలనే వారికి ఇది చక్కటి పరిష్కార మార్గం.ఇలా ప్రతిరోజు బలవర్థకమైన ఆహారాన్ని అదనంగా స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభించి నిత్యం ఆరోగ్యవంతంగా ఉంటాం.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…