Ram Gopal Varma: మారితే ఆర్జీవీ ఎలా అవుతాడు.. ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు.. కట్టప్పను ఎవరు చంపారంటూ కామెంట్!
Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య టికెట్ల రేట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఇండస్ట్రీ పెద్దలు మంత్రి పేర్ని నానిని కలిసినా.. ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు.
మరోవైపు హీరో నాని, సిద్ధార్థ్ వంటి వారు నేరుగా వైసీపీ ప్రభుత్వం పైనే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలకు ముందు హీరో నాని… ఏపీలో సినిమా థియేటర్ కలెక్షన్లు… కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువ ఉన్నాయంటూ కామెంట్లు చేశారు. దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని కూడా.. స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఈవివాదంలోకి రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. టికెట్ రేట్ల విషయంపై ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు. మంత్రి పేర్ని నాని, ఆర్జీవి మధ్య ట్విట్టర్ యుద్దమే జరిగిందని చెప్పారు. అయితే నిన్న మంత్రి పేర్ని నాని, ఆర్జీవీ భేటీ అయ్యారు. సినిమా ఇండస్ట్రీపై టికెట్ ధరల తగ్గింపు ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో… తెలియజేశారు. అయితే సమస్య అక్కడితోనే ముగిసిందని అందరూ అనుకున్నారు.
అయితే మరోసారి ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా మరో ప్రశ్నను సంధించారు రామ్ గోపాల్ వర్మ. తనదైన రీతిలో ‘ కట్టప్పను ఎవరు చంపారు’ అంటూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ముంబైలో ట్రిపుల్ ఆర్ టికెట్ ధర రూ.2200 ఉందని… ఏపీలో మాత్రం కనీసం రూ.200 కూడా లేదని ఆయన అన్నారు. తెలుగు ఇండస్ట్రీని ప్రభుత్వం చంపెస్తుందనే ఉద్దేశ్యం వచ్చేలా… కట్టప్పను ఎవరు చంపారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…