Featured

దారుణం: రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని భార్యపై దాడి చేసిన భర్త.. చివరికి ఏమైందంటే?

మద్యానికి బానిసైన వ్యక్తి రోజు మద్యం కోసం డబ్బులు కావాలని తన భార్యను తీవ్ర చిత్రహింసలకు గురి చేసే వాడు. ఈ క్రమంలోనే ప్రతి రోజు వారి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే వారికి రైతుబంధు డబ్బులు రావడంతో వాటిని ఇవ్వాలని గొడవ పడ్డాడు.అయితే ఆ డబ్బులు ఇవ్వడానికి భార్య ఒప్పుకోకపోవడంతో ఏకంగా అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆమెపై గొడ్డలితో దాడి చేసి చంపిన ఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

చందాపూర్ గ్రామానికి చెందిన సత్యమ్మ 45 రాములు పంతులకు ముగ్గురు మగ పిల్లలు ,ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. భార్యభర్తలిద్దరు వ్యవసాయ పనులు చూసుకుంటూ కూలి పనులకు వెళ్ళేవారు. అదేవిధంగా తన పెద్ద కుమారుడు అనంతపురం జిల్లాలో వరి కోత మిషన్ డ్రైవర్ గా పని చేస్తున్నారు.

గత కొంతకాలం నుంచి రాములు మద్యానికి బానిస అయ్యి ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే తనకు మరింత డబ్బు కావాలని తన భార్యతో గొడవ పడేవాడు. తన పెద్ద కుమారుడు పంపించే డబ్బులతో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన సత్యమ్మ ఆ డబ్బులు తనకు కావాలని ప్రతి రోజు భార్యతో గొడవ పెట్టుకునేవాడు. అదే విధంగా తమకు ఉన్న మూడు ఎకరాల పొలానికి రైతుబంధు డబ్బులు కూడా పడటంతో ఆ డబ్బులు ఇవ్వాలని ఆమెతో గొడవకు దిగాడు.

రైతుబంధు డబ్బులు ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించాలని తనకు ఇవ్వనని భార్య చెప్పడంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రాములు ఫుల్లుగా మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికి చేరుకొని తన భార్య గాఢంగా నిద్రిస్తున్న సమయంలో తనపై గొడ్డలితో దాడికి ప్రయత్నించాడు. ఈ విధంగా గొడ్డలితో ఆమె పై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

భార్యను చంపిన రాములు మద్యం మత్తులో తెల్లవార్లు అక్కడే కూర్చుని ఉన్నాడు.ఉదయానికి మద్యం మత్తు దిగగానే తన భార్యను తానే చంపానని తను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నానని పరుగులు పెట్టడంతో స్థానికులు అడ్డగించి ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి అతనిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి తరలించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

19 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

20 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago