విశాఖపట్నం హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)లో లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖపట్నంలోని హెచ్పిసిఎల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హెచ్పీసీఎల్ పరిసరాల్లో దట్టమైన పొగలు అలముకున్నాయి. …
మరోవైపు, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయానికి పరిశ్రమ లోపల సుమారు 100 మంది పైగా HPCL ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ప్రజలను ఖాళీచేయిస్తున్నారు. రిఫైనరీలోని ఓల్డ్ యూనిట్లోని టెర్మినల్-3 వద్ద ఈ అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సైరన్ లు మోగించారు. దీనితో ఉద్యోగులను పరిశ్రమ నుంచి బయటకు పంపుతున్నారు. హెచ్పీసీఎల్లో మూడో యూనిట్లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇది చాలా సున్నితమైన యూనిట్ కావడంతో ఇక్కడ భారీస్థాయిలో మండే పదార్థాలు ఉంటాయి. నిరంతరం అగ్నిమాపక సిబ్బంది ఈ యూనిట్లో అప్రమత్తంగా ఉంటారు.
ముడి చమురును ఈ యూనిట్లోనే ప్రాసెస్ చేస్తారని సమాచారం.. యూనిట్ మొత్తం మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. సుమారు 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు. ఏదైనా ప్రాణనష్టం జరిగిందో లేదో కూడా ఇంకా పూర్తీ సమాచారం రావాల్సి ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…