బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకొని.. ఆడియన్స్ లో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది జబర్దస్త్ యాంకర్ అనసూయ. ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు..ఇంకో వైపు సోషల్ మీడియాలో ఇలా నిత్యం బిజీ బిజీగా గడుపుతోంది ఈ హాట్ యాంకర్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులతో టచ్ లో ఉండే అనసూయ.. అప్పుడప్పుడు తన హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈ యాంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ “పుష్ప”లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ బన్నీ డెడికేషన్ చూసి ఆమే స్టన్ అయిపోయిందట ఈ ముద్దుగుమ్మ. బన్ని ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇదే మొదటి సినిమా అనేలా చేస్తాడు. నేను షూటింగ్ లో ఉన్న నాలుగు రోజులు బన్నీ లో చాలా విషయాలు గమనించాను. అర్జునుడు చెట్టు మీద వున్న పక్షిపై మాత్రమే ఏకాగ్రత పెట్టినట్లుగా. బన్నీ కళ్ళు కూడా ఎప్పుడూ డైరెక్టర్ చెప్పిన పాయింట్ మీదే ఉంటాయని అంటుంది ఈ హాట్ యాంకర్..
కాగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ’పుష్ప’ నుంచి ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజును సందర్భంగా ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో ఒక వీడియో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికీ ఈ వీడియో ‘తెగ్గేదే లే’ అంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోండి.. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా. కధానాయికగా రాష్మిక మందన్నా నటిస్తోంది.. ఇక ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగ ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇక సంగీతం టాలీవుడ్ రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ అని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో అది కుదిరేలా లేదు..!!
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…