Movie News

“కన్నప్ప”లో వాళ్లను చూస్తే ఇరిటేషన్ వచ్చింది.. తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమాపై స్పందించారు. ఈ చిత్రం కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ, బాక్సాఫీస్‌ దగ్గర నిరుత్సాహకరమైన ఫలితాన్ని అందుకుందని వ్యాఖ్యానించారు. సినిమా భారీ స్థాయిలో రూపొందించినా, భక్తి ఎలిమెంట్స్‌ను లోతుగా చూపించకపోవడమే ప్రధాన లోపమని అభిప్రాయపడ్డారు. పాన్‌ ఇండియా రేంజ్‌ కోసమే ఎక్కువ దృష్టి పెట్టారని, కానీ కథకు తగ్గట్లు మానసిక సంబంధాన్ని పెంచే ప్రయత్నం తగ్గిపోయిందని చెప్పారు.

I felt irritated when I saw them in “Kannappa” says Tammareddy Bharadwaja

రూపాయి 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, పదిరోజుల పాటు ఆడినప్పటికీ రూ. 50 కోట్ల మార్క్‌ను కూడా అందుకోలేకపోయినట్లు తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. నిర్మాత మోహన్ బాబుకి భారీ నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోందని తెలిపారు. తాను సినిమా చూసినట్లు చెబుతూ, “కథలో ఉన్న భక్తి కాన్సెప్ట్‌ను పటిష్టంగా చూపించి ఉంటే సినిమా రూ.1000 కోట్లు వసూలు చేసేది” అన్నారు.

అయితే, సినిమాలో శివుడు పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ కనిపించినప్పుడు “ఇరిటేషన్ వచ్చింది” అని స్పష్టం చేశారు. మిగిలిన పాత్రలు మాత్రం బాగున్నాయని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. కన్నప్ప సినిమా చూస్తుంటే అన్నమయ్య తరహా కంటెంట్ గుర్తుకు వచ్చిందని, కాన్సెప్ట్ అవుట్‌డేటెడ్‌గా అనిపించిందన్నారు.

అయినప్పటికీ విష్ణు ప్రయత్నాన్ని కొనియాడుతూ, “కష్టపడాడు, సినిమా పట్ల సమర్పణతో ఉన్నాడు. రివ్యూల పరంగా బ్యాడ్ రిపోర్ట్ మాత్రం రాలేదు. ఒక్కసారి అయినా చూడాల్సిందే అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపించాయి” అని చెప్పారు. మొత్తంగా, తమ్మారెడ్డి వ్యాఖ్యలు సినిమా మీద ఉన్న అంచనాలు, అవి చేరుకున్న స్థాయి మధ్య గల గ్యాప్ను స్పష్టంగా తెలియజేశాయి.

telugudesk

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

8 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago