Movie News

Fish Venkat : వెంటిలేటర్‌పై టాలీవుడ్ నటుడు వెంకట్‌.. ప్రభుత్వ సహాయంతో కుటుంబానికి ఊరట!

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వెంకట్.. ప్రస్తుతం హైదరాబాద్‌ బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో వెంటిలేటర్‌పై ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తప్పనిసరిగా మారింది. అయితే, ఆపరేషన్‌కు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.

Telangana Government helped tollywood actor fish venkat.

సినీ పరిశ్రమ నుంచి ఎదురైన నిర్లక్ష్యంపై పలుచోట్ల విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, తొలుత ప్రభాస్ టీమ్‌ నుంచి ఫోన్ వచ్చిందని, ఆయన ట్రీట్మెంట్‌ ఖర్చు భరిస్తారని వార్తలు వెలువడ్డాయి. కానీ తర్వాత ఆ కాల్ ఫేక్ కాల్‌గా మారిందని వెంకట్ కుమార్తె స్రవంతి వెల్లడించారు. దీంతో సినీ పరిశ్రమపై విమర్శలు ముదిరాయి. అంతకుముందు చిరంజీవి సహాయానికి ముందుకు వచ్చినా, స్నేహితుడి మోసం వల్ల ఆ సహాయం ముందుకు సాగలేదన్న వివరణ కూడా ఆమె ఇచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మానవత్వంతో స్పందించింది. మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వెంకట్‌ను పరామర్శించి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వెంకట్‌కు అవసరమైన మొత్తం చికిత్సా ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. అంతేకాదు, తక్షణ ఖర్చుల నిమిత్తం రూ. లక్షను వెంకట్ కుటుంబానికి అందించారు.

ఈ పరిణామంతో వెంకట్ కుటుంబానికి కొంత ఊరట లభించింది. ప్రస్తుతం కిడ్నీ డోనర్ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అప్పటి వరకు డయాలసిస్‌తో వెంకట్ చికిత్స కొనసాగనుంది. ఈ ఘటనతో ప్రభుత్వ హస్తం వల్ల ఒక కళాకారుడి ప్రాణాలు కాపాడే పరిస్థితి ఏర్పడడం పట్ల సినీ అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

telugudesk

Recent Posts

సేఫ్టీ రోప్ లేకుండానే బంగీ జంప్.. క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన యువతి..

అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే యువతలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. సాధారణ జీవితానికి భిన్నంగా ఉత్కంఠభరిత అనుభూతిని ఆస్వాదించాలనే కోరికతో వేలాది…

3 minutes ago

అమావాస్య ప్రభావమా?.. స్కూల్ రీఓపెన్ రోజున క్లాస్‌లో ఒక్క విద్యార్థినే!

వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…

2 hours ago

ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షాలు..మరో 4 రోజులు కుండపోతకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…

2 hours ago

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో అర్ధరాత్రి దొంగల కలకలం..వెంటాడిన రైల్వే పోలీసులు..

అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…

2 hours ago

విద్యార్థులకు బూట్లకు బదులు చెప్పులా? కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…

2 hours ago

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago