Movie News

Fish Venkat : వెంటిలేటర్‌పై టాలీవుడ్ నటుడు వెంకట్‌.. ప్రభుత్వ సహాయంతో కుటుంబానికి ఊరట!

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వెంకట్.. ప్రస్తుతం హైదరాబాద్‌ బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో వెంటిలేటర్‌పై ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తప్పనిసరిగా మారింది. అయితే, ఆపరేషన్‌కు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.

Telangana Government helped tollywood actor fish venkat.

సినీ పరిశ్రమ నుంచి ఎదురైన నిర్లక్ష్యంపై పలుచోట్ల విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, తొలుత ప్రభాస్ టీమ్‌ నుంచి ఫోన్ వచ్చిందని, ఆయన ట్రీట్మెంట్‌ ఖర్చు భరిస్తారని వార్తలు వెలువడ్డాయి. కానీ తర్వాత ఆ కాల్ ఫేక్ కాల్‌గా మారిందని వెంకట్ కుమార్తె స్రవంతి వెల్లడించారు. దీంతో సినీ పరిశ్రమపై విమర్శలు ముదిరాయి. అంతకుముందు చిరంజీవి సహాయానికి ముందుకు వచ్చినా, స్నేహితుడి మోసం వల్ల ఆ సహాయం ముందుకు సాగలేదన్న వివరణ కూడా ఆమె ఇచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మానవత్వంతో స్పందించింది. మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వెంకట్‌ను పరామర్శించి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వెంకట్‌కు అవసరమైన మొత్తం చికిత్సా ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. అంతేకాదు, తక్షణ ఖర్చుల నిమిత్తం రూ. లక్షను వెంకట్ కుటుంబానికి అందించారు.

ఈ పరిణామంతో వెంకట్ కుటుంబానికి కొంత ఊరట లభించింది. ప్రస్తుతం కిడ్నీ డోనర్ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అప్పటి వరకు డయాలసిస్‌తో వెంకట్ చికిత్స కొనసాగనుంది. ఈ ఘటనతో ప్రభుత్వ హస్తం వల్ల ఒక కళాకారుడి ప్రాణాలు కాపాడే పరిస్థితి ఏర్పడడం పట్ల సినీ అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

telugudesk

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

42 minutes ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

49 minutes ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

53 minutes ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

2 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

2 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

3 hours ago