Jagapathi Babu: ఆ హీరోతో తరచూ గొడవలే.. అందుకే ఇండస్ట్రీలో మిత్రులు లేరు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!
Jagapathi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతోమంది ఫ్యామిలీ ఆడియెన్స్ ను సంపాదించుకున్న ఈ హీరో తరువాత విలన్ పాత్రల ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తనలో ఉన్న విలనిజాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఇలా విలన్ గా కూడా జగపతిబాబు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నిజం చెప్పాలంటే తనకు హీరోగా కన్నా విలన్ గా మంచి గుర్తింపు వచ్చిందని స్వయంగా జగపతిబాబు ఓ సందర్భంలో వెల్లడించారు.ఇదిలా ఉండగా తాజాగా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే జగపతి బాబు మాట్లాడుతూ తనుకొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికి ఇప్పటివరకు తనకంటూ ఒక మంచి మిత్రుడు ఇండస్ట్రీలో లేరని ఈ సందర్భంగా జగపతిబాబు తెలియజేశారు.ఏదో పైకి అలా మాట్లాడి తిరిగి వారికి గుడ్ బాయ్ చెప్పేస్తాను గాని ఎవరితోనూ తనకు మంచి అనుబంధం ఏర్పడలేదని చెప్పారు.
సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు బిజినెస్ మైండ్ తోనే వ్యవహరిస్తారని,ఇండస్ట్రీలో మంచి పరిచయాలు స్నేహితులు కావాలంటే పైసా ఉండాలని పైసా ఉంటేనే పట్టించుకుంటారని ఎంతో ఓపెన్ గా ఈ విషయాలను తెలిపారు.ఇకపోతే తెలుగు ఇండస్ట్రీలో ఓకే ఒక మిత్రుడు ఉన్నారని అతనితో కూడ తనకి తరచు గొడవలు జరిగేవని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతను ఎవరో కాదు హీరో అర్జున్. తను నాకు మంచి మిత్రుడు తరచూ మా మధ్య సరదాగా గొడవలు జరిగేవి కానీ వాటికి చాలామంది సీరియస్ గా గొడవ పడుతున్నామని అనుకొనే వారు అంటూ జగపతిబాబు ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…