మహేంద్ర సింగ్ ధోనీ.. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెట్ కెప్టెన్లలో ఒకరు. ఇండియాకు అతడి కెప్టెన్ లో రెండు సార్లు వరల్డ్ కప్ ను అందించాడు. అంతటి చరిత్ర మహేంద్ర సింగ్ ధోనికి ఉంది. అతడి ఆటలో కూడా ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ఇక అతడు గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు.
ధోని పెళ్లి చేసుకోవడానికి ముందు.. అతడు కొంతమందితో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు , పుకార్లు వచ్చాయి. నటి రాయ్ లక్ష్మితో ఎంఎస్ ధోని డేటింగ్ వెళ్లినట్లు కూడా పుకార్లు వచ్చాయి. 2008-2009 సమయంలో ఈ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో వీరిద్దరు కలిసినప్పుడు తరచుగా మీడియా కంట పడేవారు. దీంతో వారిద్దరి మధ్య రిలేషన్ నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచాక.. ఆ టీం సభ్యులు అంతా ఓ పార్టీ చేసుకున్నారు. అందులో చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడు సురేష్ రైనాతో కలిసి ఆమె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు ధోని. ఎందుకంటే.. ఆసమయంలో రాయ్ లక్ష్మీ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఇలా ఆమె ధోనికి ఆ సమయంలో దగ్గర అయ్యారు. తర్వాత ధోని పెళ్లి చేసుకొని.. ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. కానీ రాయ్ లక్ష్మి మాత్రం ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఓ ఇంటర్వ్యూలో ధోనికి.. అమెకు ఉన్న సంబంధం గురించి ఓపెన్ అయ్యారు.
“ధోనీతో నా సంబంధం ఒక మచ్చ లాంటిదని.. అది చాలా కాలం వరకు పోలేదని.. తాము విడిపోయిన 12 ఏళ్లు అవుతున్నా ఇంకా దాని గురించే మాట్లాడటంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంవత్సరం పాటు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ధోని, తాను సామరస్యంగా విడిపోవాలని అనుకున్నట్లు రాయ్ లక్ష్మీ స్పష్టం చేసింది. ఎలాంటి గొడవలు లేకుండా బ్రేకప్ చెప్పుకొన్నట్లు వెల్లడించింది. బ్రేకప్ జరిగినా తమకు ఒకరిపై మరొకరికి రెస్సెక్ట్ ఉందని పేర్కొంది. ధోనితో బ్రేకప్ తర్వాత తన లైఫ్ లో ఇలాంటివి ఎన్నో జరిగాయని.. వాటి గురించి ఎవరూ మాట్లాడరని.. మీడియా సమావేశం పెడితే కేవలం ధోనితో సంబంధం గురించే మాట్లాడుతారని అసహనం వ్యక్తం చేశారు. ఆమె చివరిగా సిండ్రెల్లా ఔటింగ్, ఝాన్సీ IPS, ఆనంద భైరవి మరియు గ్యాంగ్స్టర్ 21 లో నటించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…