మహేంద్ర సింగ్ ధోనీ.. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెట్ కెప్టెన్లలో ఒకరు. ఇండియాకు అతడి కెప్టెన్ లో రెండు సార్లు వరల్డ్ కప్ ను అందించాడు. అంతటి చరిత్ర మహేంద్ర సింగ్ ధోనికి ఉంది. అతడి ఆటలో కూడా ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ఇక అతడు గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు.
ధోని పెళ్లి చేసుకోవడానికి ముందు.. అతడు కొంతమందితో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు , పుకార్లు వచ్చాయి. నటి రాయ్ లక్ష్మితో ఎంఎస్ ధోని డేటింగ్ వెళ్లినట్లు కూడా పుకార్లు వచ్చాయి. 2008-2009 సమయంలో ఈ వార్తలు వచ్చాయి. ఆ సమయంలో వీరిద్దరు కలిసినప్పుడు తరచుగా మీడియా కంట పడేవారు. దీంతో వారిద్దరి మధ్య రిలేషన్ నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచాక.. ఆ టీం సభ్యులు అంతా ఓ పార్టీ చేసుకున్నారు. అందులో చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడు సురేష్ రైనాతో కలిసి ఆమె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు ధోని. ఎందుకంటే.. ఆసమయంలో రాయ్ లక్ష్మీ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరించారు. ఇలా ఆమె ధోనికి ఆ సమయంలో దగ్గర అయ్యారు. తర్వాత ధోని పెళ్లి చేసుకొని.. ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. కానీ రాయ్ లక్ష్మి మాత్రం ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఓ ఇంటర్వ్యూలో ధోనికి.. అమెకు ఉన్న సంబంధం గురించి ఓపెన్ అయ్యారు.
“ధోనీతో నా సంబంధం ఒక మచ్చ లాంటిదని.. అది చాలా కాలం వరకు పోలేదని.. తాము విడిపోయిన 12 ఏళ్లు అవుతున్నా ఇంకా దాని గురించే మాట్లాడటంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంవత్సరం పాటు రిలేషన్షిప్లో ఉన్న తర్వాత ధోని, తాను సామరస్యంగా విడిపోవాలని అనుకున్నట్లు రాయ్ లక్ష్మీ స్పష్టం చేసింది. ఎలాంటి గొడవలు లేకుండా బ్రేకప్ చెప్పుకొన్నట్లు వెల్లడించింది. బ్రేకప్ జరిగినా తమకు ఒకరిపై మరొకరికి రెస్సెక్ట్ ఉందని పేర్కొంది. ధోనితో బ్రేకప్ తర్వాత తన లైఫ్ లో ఇలాంటివి ఎన్నో జరిగాయని.. వాటి గురించి ఎవరూ మాట్లాడరని.. మీడియా సమావేశం పెడితే కేవలం ధోనితో సంబంధం గురించే మాట్లాడుతారని అసహనం వ్యక్తం చేశారు. ఆమె చివరిగా సిండ్రెల్లా ఔటింగ్, ఝాన్సీ IPS, ఆనంద భైరవి మరియు గ్యాంగ్స్టర్ 21 లో నటించారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…