తెలుగు ఇండస్ట్రీలో తన బాధను గానీ, ఇంకెలాంటి ఫీలింగ్నైనా పంచుకోవడానికి కొంత మంది తనకు అత్యంత సన్నిహితులున్నారని నటుడు అనంత ప్రభు తెలిపారు. అందులో ముఖ్యంగా శ్రీకాంత్, తరుణ్లాంటి వారున్నారని ఆయన అన్నారు. తామంతా క్రికెట్ ఆడుతూ ఆడుతూ అలా క్లోజ్ అయ్యామని ప్రభు చెప్పారు.
చిత్ర పరిశ్రమలో అందరితోనూ ఒకలా ఉండలేమని ప్రభు అన్నారు. అలాగే అందరితోనూ అన్ని విషయాలూ షేర్ చేసుకోలేమని, అలా అనిపించేది మాత్రం ఒక్క శ్రీకాంత్ గారితోనే అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకి కూడా తాను నచ్చడం నిజంగా తన అదృష్టమని ఆయన చెప్పారు. అలాగే తరుణ్, అల్లరి నరేష్ కూడా తనతో చాలా సాన్నిహిత్యంగా ఉంటారని ఆయన అన్నారు.
కానీ ఎవరితో ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఒక లైన్ అనేది మెయింటైన్ చేస్తానని ప్రభు చెప్పారు. లేదంటే మొత్త అడ్వాంటేజ్ తీసుకుంటానేమో తానే అని ఆయన తెలిపారు. అయితే ఒకసారి తన వద్దనున్న కారు తీసేసి కొంచెం పెద్ద కారు తీసుకుంటా అన్నపుడు, శ్రీకాంత్ అన్ని వివరాలు అడిగి, చివరికి కొత్త కారు ఎందుకు మళ్లీ ? డబ్బులు ఎందుకు వృథా చేయడం ? వచ్చి ముందు పని చెయ్యి. నువ్వు ఏ కారులో వచ్చావు అనేది ఎవరూ చూడరు. పని చేశావా లేదా అనేది మాత్రమే చూస్తారని ఆయన అన్నట్టు ప్రభు వివరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…