తెలుగు ఇండస్ట్రీలో తన బాధను గానీ, ఇంకెలాంటి ఫీలింగ్నైనా పంచుకోవడానికి కొంత మంది తనకు అత్యంత సన్నిహితులున్నారని నటుడు అనంత ప్రభు తెలిపారు. అందులో ముఖ్యంగా శ్రీకాంత్, తరుణ్లాంటి వారున్నారని ఆయన అన్నారు. తామంతా క్రికెట్ ఆడుతూ ఆడుతూ అలా క్లోజ్ అయ్యామని ప్రభు చెప్పారు.
చిత్ర పరిశ్రమలో అందరితోనూ ఒకలా ఉండలేమని ప్రభు అన్నారు. అలాగే అందరితోనూ అన్ని విషయాలూ షేర్ చేసుకోలేమని, అలా అనిపించేది మాత్రం ఒక్క శ్రీకాంత్ గారితోనే అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకి కూడా తాను నచ్చడం నిజంగా తన అదృష్టమని ఆయన చెప్పారు. అలాగే తరుణ్, అల్లరి నరేష్ కూడా తనతో చాలా సాన్నిహిత్యంగా ఉంటారని ఆయన అన్నారు.
కానీ ఎవరితో ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఒక లైన్ అనేది మెయింటైన్ చేస్తానని ప్రభు చెప్పారు. లేదంటే మొత్త అడ్వాంటేజ్ తీసుకుంటానేమో తానే అని ఆయన తెలిపారు. అయితే ఒకసారి తన వద్దనున్న కారు తీసేసి కొంచెం పెద్ద కారు తీసుకుంటా అన్నపుడు, శ్రీకాంత్ అన్ని వివరాలు అడిగి, చివరికి కొత్త కారు ఎందుకు మళ్లీ ? డబ్బులు ఎందుకు వృథా చేయడం ? వచ్చి ముందు పని చెయ్యి. నువ్వు ఏ కారులో వచ్చావు అనేది ఎవరూ చూడరు. పని చేశావా లేదా అనేది మాత్రమే చూస్తారని ఆయన అన్నట్టు ప్రభు వివరించారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…