ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందాలనుకునే కస్టమర్లకు ఐడీబీఐ బ్యాంక్ ఓ సరికొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ బ్యాంక్ తమ కస్టమర్లకు ఎన్నోరకాల సర్వీసులను అందిస్తుంది. వీటిలో ప్రత్యేకమైన పథకాలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎస్ఎస్పీ ప్లస్ అనే ఒక పథకం ఉంది. ఈ పథకం ద్వారా కస్టమర్లు రెగ్యులర్ గా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందవచ్చని తాజాగా బ్యాంకు యాజమాన్యం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఈ బ్యాంకు కస్టమర్లు ప్రతినెల తమకు నచ్చిన మొత్తాన్ని
ఐడీబీఐ సిస్టమ్యాటిక్ సేవింగ్స్ ప్లాన్ ద్వారా జమ చేసుకోవచ్చు. ప్రతి నెల మనం ఎంత మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయాలని భావిస్తామో అంత మొత్తాన్ని ప్రతినెల మన అకౌంట్ నుంచి కట్ అవుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు.
ఈ బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తున్న ఎస్ఎస్పీ ప్లస్ స్కీమ్ వల్ల డబ్బులతో పాటు ఆ డబ్బుకు వడ్డీని కూడా పొందవచ్చు. అదేవిధంగా ఐదు లక్షల రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా బ్యాంక్ తమ కస్టమర్లకు అందిస్తోంది. అయితే ఈ పథకం ద్వారా ఒక ఏడాది నుంచి పదేళ్ల వరకు డబ్బులను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ప్రతి నెల వంద రూపాయల నుంచి డిపాజిట్ పొందవచ్చు. ఈ పథకంలో డబ్బులను జమ చేసే కస్టమర్లు ప్రతి నెల బ్యాంకు వెళ్ళే పని లేకుండా తమ కస్టమర్లకు నెట్ బ్యాంకింగ్ లేదా గో మొబైల్ ప్లస్ యాప్ ద్వారా ఎస్ఎస్పీ ప్లస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…